Friday 13 July 2012

DRUGS LOW QUALITY

ఇదేమి మాత్ర.. వైకుంఠ యాత్ర

మందుల మాయా బజార్

7/14/2012 1:05:00 AM

2011 ఏప్రిల్ సంగతి. కాకినాడలో రేబిస్ సోకి 10 మంది మరణించారు. వారందరికీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) వేసినా ఫలితం లేకపోయింది. ఆ వ్యాక్సిన్ పని చేయకపోవడమే మరణానికి కారణమని అధికారులు కూడా ధ్రువీకరించారు. అయినా సరే, అదే నాసిరకపు మందు ఇప్పటికీ యథావిధిగా సరఫరా అవుతూనే ఉంది!

ఉసురు తీస్తున్న సర్కారీ దవాఖానా మందులు

మూడేళ్లుగా నాణ్యతా పరీక్షలకే దిక్కు లేదు
ల్యాబ్‌కు వెళ్లకుండానే రోగుల కడుపులోకి 205 రకాల మందుల్లో 75 శాతం ఇలాంటివే
ప్రాణాలు కాపాడే ఔషధాలపై పరీక్షలు కరువు
ఏ మాత్రమూ పట్టించుకోని సర్కారు
చోద్యం చూస్తున్న ఆరోగ్య శాఖ, డీసీఏ

గుండం రామచంద్రారెడ్డి

సర్కారీ ఆస్పత్రుల మందులు మింగడమంటే ఆరోగ్యంతో ప్రాణాంతక జూదమాడటంగా మారిపోయింది. జబ్బు నయమైందా.. రోగి అదృష్టం. లేదంటే ప్రాణాలు హరీ. పాశ్చాత్య దేశాల్లో పశువుల మందులను కూడా ప్రయోగశాలల్లో ఒకటికి పదిసార్లు పరీక్షించి గానీ మార్కెట్లోకి విడుదల చేయరు. కానీ మన రాష్ట్రంలోనేమో మనుషులకిచ్చే ఔషధాలకు కూడా పరీక్షలు జరిపే దిక్కు లేదు. పై ఉదంతంలోని రేబిస్ వ్యాక్సిన్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని సర్కారీ దవాఖానాల్లో వాడుతున్న 75 శాతం మందులదీ ఇదే పరిస్థితి! వాటికి పరీక్షలు జరుగుతున్నాయా, అవి నాణ్యమైనవేనా, వాడితే దుష్ఫలితాలొస్తున్నాయా, అసలా మందులు పనిచేస్తున్నాయా వంటి మౌలికాంశాలను కూడా సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. తయారీ సంస్థో, డిస్ట్రిబ్యూటరో ఇచ్చినవే మాత్రలు. వాటిని గుడ్డిగా కొనేయడం, నేరుగా పేద రోగులకు అంటగట్టడం.. ఇదే రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కర్తవ్యంగా మారింది. కనీసం వైద్య ఆరోగ్య శాఖ గానీ, ఔషధ నియంత్రణ సంస్థ గానీ దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నాణ్యతా పరీక్షలు పూర్తయి, నివేదిక వచ్చాకే మందులను రోగులకు సరఫరా చేయాలని చట్టం చెబుతున్నా వాటికి పట్టడం లేదు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో జనరిక్ మందులను తక్కువ ధరకే కొని కూడా విధిగా పరీక్షలు చేశాకే పంపిణీకి అనుమతిస్తుంటే.. మన దగ్గర మాత్రం ఎక్కువకు కొని, పరీక్షలే లేకుండా రోగుల మీదకు వదులుతున్నారు. ఇలాంటి నాణ్యత లేని మందుల వాడకం ఎక్కువై, దానివల్ల మూత్రపిండాల సమస్యలతో రోగులు అల్లాడుతున్నారని నివేదికలన్నీ ఘోషిస్తున్నా సర్కారులో మాత్రం స్పందన శూన్యం.

మూడేళ్లుగా పరీక్షలు నిల్


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ ఆస్పత్రులకు మందులను సేకరించి, సరఫరా చేసే బాధ్యత ఏపీఎంఎస్‌ఐడీసీది. సుమారు 205 రకాల సాధారణ మందులు, 28 రకాల యాంటీబయోటిక్స్ మందులు, 10 రకాల ఐవీ ఫ్లూయిడ్స్, 202 రకాల శస్త్రచికిత్సల ఉపకరణాలను ఇది సరఫరా చేస్తోంది. ఇందుకు ఏటా రూ.380 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటికీ సంబంధించి ప్రతి బ్యాచ్‌నూ ముందే అనాలసిస్ (పరీక్ష)కు పంపి, అవి నాణ్యమైనవని తేలాకే రోగుల కోసం సరఫరా చేయాలి. కానీ గత మూడేళ్లుగా ఈ మందులు అసలు పరీక్షలకే నోచుకోవడం లేదు. జరిగిన ఒకటీ అరా పరీక్షలూ తూతూమంత్రంగానే ముగుస్తున్నాయి. పైగా వాటి ఫలితాలు కూడా రోగులు వాడిన ఏడాదికి గానీ రావడం లేదు! వాటిలో పలు మందులు నాణ్యమైనవి కావని తేలిన సందర్భాలకూ కొదవ లేదు. 2011లో విడుదలైన హెచ్‌ఐవీ టెస్ట్ కిట్‌లు, మిథైల్ ఎర్గోమెట్రైన్, రానిటిడైన్, సిప్రోఫ్లాక్సాసిన్, డొపామిన్, అమోక్సిసిలిన్ క్లావనిక్ వంటి మందులు నాసిరకపువని అవి మార్కెట్లోకి వెళ్లిన ఆర్నెల్ల తర్వాత నివేదికలు వచ్చాయి! ఆలోపు వాటిని వాడిన రోగుల పరిస్థితేమిటో ఆ దేవునికే తెలియాలి. ఇవే కాదు.. దీర్ఘకాలిక రోగాల నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను కూడా అసలు పరీక్షలకే పంపడం లేదంటే నమ్మి తీరాల్సిందే! కంపెనీలో తయారవడం, నేరుగా ఆస్పత్రులకు వెళ్లడం.. నిత్యం ఇదే తంతు. దీనిపై నిఘా వ్యవస్థ లేదు. నాణ్యతా పరీక్షల్లేవు. ఎవరూ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. హెచ్‌ఐవీ రోగులకు వాడే ఎసిక్లోవిర్‌తో పాటు కళ్ల ఇన్‌ఫెక్షన్, గుండె సమస్యలు, గర్భకోశ వ్యాధులు, మధుమేహం, పాముకాటు తదితరాలకు వాడే అతి ముఖ్యమైన మందుల్లో 75 శాతం దాకా అసలు పరీక్షల ముఖమే చూడకుండా నేరుగా ప్రభుత్వాసుపత్రులకు, అక్కడ్నుంచి రోగుల కడుపులోకి వెళ్తున్నాయి! రాష్ట్రంలో ఉన్నవి రెండే ల్యాబొరేటరీలు. ఒకటి ఐటీఎల్, రెండోది పీఆర్‌కే. వీటిలో ఏటా 50 రకాలకు మించి నాణ్యతా పరీక్షలు జరగవంటే.. మన మందులను ఎంతమేరకు పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఏపీఎంఎస్‌ఐడీసీ పరిధిలో పనిచేస్తున్న అనాలసిస్ వింగ్‌కు అధికారే లేడు! టెండర్లకు సవాలక్ష నియమాలు పెట్టి, పలు కంపెనీలపై అనర్హత వేటు వేసి, అస్మదీయ కంపెనీలకు మాత్రమే ఆర్డర్లిచ్చే అధికారులు, సదరు మందుల అనాలసిస్‌కు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.


మాకు పంపడంలేదు

‘‘ప్రభుత్వాసుపత్రులకు సరఫరా అయ్యే మందులను డ్రగ్ కంట్రోల్ పరిధిలోని రెండు ల్యాబ్‌లను కాదని ప్రైవేటు ల్యాబ్‌లకు ఏపీఎంఎస్‌ఐడీసీ పంపుతోంది. కాబట్టి దాంతో మాకు సంబంధం లేదు’’
- ఆర్.పి.ఠాకూర్, ఔషధ నియంత్రణ శాఖ డెరైక్టర్ జనరల్

ల్యాబ్‌లకు వస్తున్నవి 30 శాతమే


‘‘రెండు ల్యాబ్‌లే ఉన్నందువల్ల మందుల పరీక్షల్లో జాప్యం (బ్యాక్‌లాగ్) ఏర్పడుతోంది. త్వరలో మరో 4 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని మందులనూ ల్యాబ్‌లకు పంపి, పరీక్షించాకే మార్కెట్లోకి అనుమతిస్తాం’’

-శ్రీనివాస్, బయోమెడికల్ ఇంజనీర్, అనాలసిస్ వింగ్ ఇన్‌చార్జి
ఎన్‌ఎస్‌క్యూ అంటే నాసిరకమైనవి (నాట్ స్టాండర్డ్ క్వాలిటీ). కానీ ఈ రిపోర్టులు వచ్చేనాటికే పై మందులన్నీ జనంలోకి వెళ్లి ఆరు నెలలు దాటింది!

అంటే దాదాపుగా 75 శాతం మందులు ప్రయోగశాలల ముఖమే చూడకుండా నేరుగా రోగుల కడుపులోకి వెళ్తున్నాయి

తమిళనాట ప్రతి మందూ పరీక్షకు వెళ్లాల్సిందే!

తమిళనాడులో ఒక్క మందు కూడా పరీక్ష జరగకుండా జనంలోకి వెళ్లదు. 6 నెలల ముందే మందులకు ఆర్డరిస్తారు. ఆ వెంటనే తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ వాటిని పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. ఇందుకు సొంతగా పెద్ద ల్యాబ్ ఉంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ పరీక్షలకు అనుమతిస్తారు. మూడు నెలల్లోపే రిపోర్టులు వస్తాయి. ఆ తర్వాతే ఆస్పత్రులకు పంపిస్తారు. నాసిరకమని తేలితే తిప్పి పంపుతారు. ఇంతా చేసి మన రాష్ట్రంలో కంటే ప్రతి మాత్రనూ తమిళనాడులో 20 శాతం తక్కువ ధరకే

No comments:

Post a Comment