Friday 13 July 2012

FAKE ENCOUNTERS OF SITARAMANJANEYULU

ఎన్‌కౌంటర్లు కావు.. ఖాకీ వేట
ఎస్పీగా సీతారామాంజనేయులు సంహారకాండ
నప్పుబట్టిన జాతీయ హక్కుల కమిషన్
16 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

గుంటూరు, కర్నూలు ఎస్పీగా చెలరేగిన పీఎస్ఆర్
రెండేళ్లలో 19 మంది కాల్చివేత
నక్సల్స్, ఫ్యాక్షనిస్టులంటూ హత్యలకు 'చట్టబద్ధత'
కోర్టుకు వెళ్లకముందే 'ఖాకీ తీర్పు'.. మరణ శిక్ష
నరమేధంపై నిలదీసిన మానవ హక్కుల వేదిక
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
కమిషన్‌ను కదిలించిన న్యాయవాది చంద్రశేఖర్
రామాంజనేయులుపై కేసు పెట్టాలి: చంద్రశేఖర్
కాలేజీకి పోయిన కుర్రాళ్లు శవాలై ఇంటికి వస్తారు. పొద్దున్నే పొలానికి పోయిన రైతు మళ్లీ ఆ ఊళ్లో ఎవరికీ కనిపించడు. అప్పటిదాకా టీ కొట్టు దగ్గర బాతాఖానీ కొట్టిన చోటామోటా నేత కాస్తా ఆలివ్‌గ్రీన్ దుస్తుల్లోకి మారిపోయి గుర్తుతెలియని మృతదేహంగా మారతాడు. ఏదో పని మీద బయట ఊరికి బయలుదేరిన భర్త, తీవ్రవాది ముద్రతో తెల్లారిపోతాడు. సినిమాకు స్నేహితులతో బయలుదేరిన కొడుకు, వారందరితో పాటు రహస్య సమావేశంలో ప్రత్యక్షమై, భీకర ఎదురు కాల్పుల్లో మరణిస్తాడు.. నియంతల ఏలుబడిలోని లాటిన్ అమెరికా దేశాల్లోనో, ప్రైవేట్ సాయుధ సైన్యాల కనుసన్నల్లోని బీహార్, ఉత్తరప్రదేశ్‌లలోనో జరిగిన ఘటనలు కావివి. ద గ్రేట్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు పి. సీతారామాంజనేయులు జరిపించిన నరమేధంలోని కొన్ని నెత్తుటి పుటలివి. 2000 ప్రాంతంలో ఆయన కర్నూలు, గుంటూరు ఎస్పీగా ఉండగా.. వివిధ కేసుల్లోని నిందితులను.. 'ఆత్మరక్షణ' పేరిట, నక్సలైట్ల సాకుతో చంపించిన తీరిది. కోర్టులు, చట్టాలు, సర్వీస్ నిబంధనలన్నింటినీ తోసిరాజని.. తుపాకీ చేతపట్టి సాగించిన వేట తీరిది. ఈ కిరాతకానికి ఎన్‌కౌంటర్ అని పేరు..ఖాకీ ముఖానికి గల హింస పార్శ్వానికి పరాకాష్ఠలా సాగిన ఈ బూటకపు ఎన్‌కౌంటర్ల తీరుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం నివ్వెరపోయింది. మానవ హక్కుల వేదిక నేత, న్యాయవాది బి. చంద్రశేఖర్ రెండు దశాబ్దాల పోరుకు స్పందించింది. "ఇంత దారుణంగా చంపిపడేసి.. ఎన్‌కౌంటర్ అంటారా?'' అని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు డిపార్టుమెంట్‌పై ఫైర్ అయింది. మొత్తం 19 కేసుల్లో 16 కేసులను 'బూటకం'గా తేల్చి బాధితులకు రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్ కేసుల్లో ఈస్థాయిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
పి.సీతారామాంజనేయులు..వివాదాస్పద పోలీస్ అధికారి. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులపై రౌడీయిజం చే యడం మొదలు, విజయవాడ కమిషనర్‌గా.. నగర శాంతి భద్రతలను పక్కనబెట్టి, ఈవ్‌టీజర్ అవతారం ఎత్తడం దాకా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని 'వేటు'కు గురైన ఖాకీ బాస్. కానీ, ఆయన సర్వీస్‌లోని మరో చీకటి కోణం ఇప్పుడు వెలుగు చూసింది. 2000 నుంచి 2002 మధ్య కాలంలో గుంటూరు, కర్నూలు ఎస్పీగా ఉండగా ఎడాపెడా చేయించిన 'ఎన్‌కౌంటర్లు' ఆయన మెడకు చుట్టుకున్నాయి. చేసిన పాపం చేతులు కడుక్కుంటే పోదు అన్నట్టు..ఆయా ఎన్‌కౌంటర్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టి సారించింది. వాటన్నింటిని దాదాపు బూటకం గా తేల్చి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహా రం అందజేయాలని ప్రభుత్వానికి సూచించిం ది. దీంతో..బాధితులను గుర్తించి పరిహారం పంపిణీ చేసే పని ఇప్పటికే మొదలైంది. పలు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన కాలంలో సీతారామాంజనేయులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడినట్టు గుంటూరుకు చెందిన మానవ హక్కుల వేదిక నేత, న్యాయవాది బి చంద్రశేఖర్ 2002 జూలై 11న ఎన్‌హెచ్ ఆర్‌సీకి ఫిర్యాదు చేయడంతో తీగ కదిలింది. అప్పట్లో జరిగిన మొత్తం 19 ఎన్‌కౌంటర్ కేసుల వివరాలను కమిషన్‌కు ఆయన ససాక్ష్యంగా సమర్పించా రు. దీనిపై గత ఏడాది నవంబర్‌లో కమిషన్ విచారణ పూర్తి చేసింది. 16 కేసుల్లో ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చి ంది. అందులో 10 కేసులు కర్నూలు, ఆరు గుంటూరులో నమోదయ్యాయి. వీటిలో ఒక్కటిమాత్రమే నక్స ల్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన కేసు. కాగా, బా ధితులకు పాక్షిక న్యాయం మాత్రమే అం దినట్టు చంద్రశేఖర్ అభిప్రా యపడ్డారు. బాధ్యులకు శిక్ష పడేదాకా పోరు ఆగదని, అవ సరమైతే సుప్రీంకోర్టుకు వెళతా మన్నారు. మరోవైపు, సీతారామాంజ నేయులను శిక్షించాలంటూ బాధితులు హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు.

కర్నూలులో నెత్తురు పారిందిలా..

2000 మే 16: డోన్‌లో టీడీపీ సానుభూతిపరుడు ఏరుకుల శ్రీను (30) కాల్చివేత.

జూన్ 12: మామిడాలపాడు వద్ద టీడీపీ సానుభూతిపరులు పిక్కిలి బాబు (30), బోయ వెంకట రాముడు(35), వెంకటేశ్వర్లు (32) కాల్చివేత. వీరందరినీ ఓ కేసులో కర్నూలు జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకు వెళ్లే క్రమంలో చంపేశారు.

జూలై 14: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి రామలింగ ప్రసాద్ (28)ను హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకొని బనగానపల్లి వద్ద కాల్చివేశారు.

జూలై 22: మహానంది మండలం గాజుపల్లి వద్ద నల్లబోతుల సుంకన్న కాల్చివేత. నిజానికి, అంతకు వారం క్రితం సోదరి ఇంటి నుంచి పోలీసులు సుంకన్నను మాయం చేశారు. నకిలీ నక్సలైట్ అనేది పోలీసుల అభియోగం.

సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, హత్య, పలు చోరీ కేసుల్లో నిందితుడు బసివిరెడ్డి అశ్వద్ధ్దరెడ్డి (35)ని ప్రకాశం జిల్లా కనిగిరిలో అదుపులోకి తీసుకొని కర్నూలు జిల్లా బేతంచర్ల వద్ద కాల్చేశారు.

అక్టోబర్ 22: హత్యాయత్నం కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కల్లూరి వెంకటేశ్వర్లు (35)ను ఇంటి నుంచి తీసుకెళ్లి చంపేశారు.

డిసెంబర్ 4: మాజీ సీఎం కోట్ల విజయ భాస్కరరెడ్డి తనయుడు సూర్య ప్రకాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వస్తున్న కాంగ్రెస్‌కు చెందిన కిష్టన్న (45) రాముడు అలియాస్ రసూల్ (42)ను తీసుకెళ్లి కాల్చివేత. వారిద్దరిపై ఫ్యాక్షనిస్టు ముద్ర ఉంది.

2001 ఏప్రిల్ 2: తల్లితో పాటు హోటల్‌లో ఉన్న టీడీపీ కార్యకర్త కొమరవోలు రమేష్‌ను పట్టుకొని చెన్నమొహట్టిపల్లి వద్ద కాల్చేశారు.

ఆగస్టు 2: సిపిఐ నేత, పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు గుండ్లకొండ శ్రీనివాసులుని (35) గ్రామంలో పట్టుకొని దేవరకొండ వద్ద కాల్చేశారు.

నవంబర్ 11: రాజబాబు అలియాస్ రాజు (35)ను పిన్నాపురం వద్ద చంపేశారు.

గుంటూరు గుండెల్లో తూటా..

2002 మే 4: పలు దోపిడీ కేసుల్లో నిందితుడు మేడా వెంకటేశ్వర్లు (40)ను మణికొండలోని ఇంటి వద్ద నుంచి మే 1న తీసుకెళ్లి నాలుగు రోజుల తరువాత సీతానగరం వద్ద కాల్చేశారు.

జూన్ 4: దోపిడీ కేసుల్లో రిమాండ్ ఖైదీలు కోదాటి శ్రీను (36), కంపా శ్రీను (30) తాడిగిరి సురేష్ (35), మేచర్ల లక్ష్మణరావు (40)లను సత్తెనపల్లి సబ్ జైల్ నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువస్తూ పేరేచర్ల వద్ద కాల్చేశారు.

జూలై 7: పీపుల్స్‌వార్ పార్టీ కార్యకర్త దున్నా సుధాకర్ (24)ను నాగార్జున సాగర్ వద్ద అదుపులోకి తీసుకొని రెండు రోజుల తరువాత పల్నాడులోని పసర్లపాయి తండా వద్ద కాల్చేశారు.

ఇదేం ఎన్‌కౌంటర్..?

పేరు మేడా వెంకటేశ్వర్లు. విజయవాడ-వెంకటపాలెం రోడ్డుపై 2002 మే 4న తెల్లవారు జామున 3 గంటలకు తారసపడ్డాడు. ఆరా తీసేందుకు సబ్-ఇన్‌స్పెక్టర్ కె సుధాకర్ ఆగమన్నాడు. కానీ వెంకటేశ్వర్లు ఆగకపోగా కాల్పులు జరపడంతో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. రివాల్వర్‌లో బుల్లెట్లు అయిపోయేంతవరకూ కాల్పులు జరిపి తర్వాత మళ్లీ లోడ్ చేసుకుని కాల్పులు కొనసాగించాడు. కాల్పులు ఆగిపోయాక వెళ్లి చూస్తే వెంకటేశ్వర్లు చనిపోయి ఉన్నాడు''.. ఇదీ ఎస్ఐ 'ఆత్మరక్షణ' కథనం. కానీ, ఈ కథనాన్ని కమిషన్ తోసిపుచ్చింది. " వెంకటేశ్వర్లు శరీరంపై ఉన్న గాయాలను బట్టి చూస్తే మీ కథనం నమ్మశక్యంగా లేదు.

ఛాతీకి గురిపెట్టి నాలుగు సార్లు కాల్పులు జరిపినట్లు పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది. నాలుగూ ఛాతీకే ఎలా తగిలాయి? నిస్సహాయుడై ఉన్నప్పుడు ఎస్ఐ వరుసగా కాల్పులు జరిపి ఉంటాడు. ఇది మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే'' అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. సదరు ఎన్‌కౌంటర్లపై పదే పదే నోటీసులు పంపినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఈ ఉదం తం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని రాష్ట్ర పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

బలయింది బడుగులే..

మొత్తం 19 మందిలో ఇద్దరు తప్ప అందరూ బడుగులే. వారిలో 9 మంది ఎరుకలు కాగా, ఐదుగురు బోయలు. ముగ్గురు దళితులు. వీరిలో కొందరు నేరస్తులూ ఉండొచ్చు. తీవ్ర నేరాభియోగాలు నమోదై ఉండవచ్చు. కానీ, ఈ కారణంగా పిట్టల్లా కాల్చి చంపే హక్కు పోలీసులకు లేదనేది హక్కుల నేతల వాదన. కానీ, తాను పనిచేసిన ప్రతి జిల్లాలోనూ సీతారామాంజనేయులు..మనుషులను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించారనేది కమిషన్ ఆదేశాలతో తేలిపోతోంది.
- ఆన్‌లైన్, న్యూఢిల్లీ, హైదరాబాద్, గుంటూరు, కర్నూలు

HOUSE OF SKULLS




పుర్రెల గృహం

స్ట్రేంజ్



ఆస్ట్రియాలోని ‘బోన్ హౌజ్’లో వందలసంఖ్యలో పుర్రెలు భద్రపరచబడి ఉన్నాయి. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ బోన్ హౌజ్‌ను నిర్మించడానికి ఒక కారణం ఉంది. సరస్సు పక్కనే ఒక శ్మశానం ఉండేది. చుట్టు పక్కల ప్రాంతాల మృతులను పూడ్చిపెట్టడానికి ఆ శ్మశాన స్థలం సరిపోయేది కాదు. దీంతో బోన్ హౌజ్ నిర్మించారు.

మృతశరీరాలను శ్మశానంలో పాతి పెట్టిన పది, పదిహేను సంవత్సరాల తరువాత వాటి పుర్రెలను ఈ బోన్ హౌజ్‌లో పెడతారు. షెల్ఫ్‌లలో పుస్తకాలను భద్రపరిచినట్లు ఈ పుర్రెలను భద్రపరిచి, అందంగా అలంకరించి వాటి మీద పేర్లు రాస్తారు. కొవ్వొత్తులు వెలిగిస్తారు!

BAN ON LOVE IN A UP VILLAGE








ప్రేమ వివాహాలపై నిషేధం



7/14/2012 12:03:00 AM

- మహిళల షాపింగ్ కుదరదు
- యూపీ గ్రామంలో తాలిబన్ తరహా నిషేధాజ్ఞలు

బాఘ్‌పట్: ఉత్తరప్రదేశ్‌లో తాలిబన్ల తరహా సంస్కృతి బుసలుకొట్టింది. ఓవైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్ జిల్లాలోని అసారా గ్రామంలో ఉన్న ఖాప్ పంచాయతీ మాత్రం అతివల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా... వారి స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా అర్థంలేని ఆంక్షలు విధించింది. ప్రేమ పెళ్లిళ్లను నిషేధించడంతోపాటు 40 ఏళ్లలోపు మహిళలు షాపింగ్‌కు వెళ్లరాదని, ఇళ్ల బయట సెల్‌ఫోన్లు వాడరాదని హుకుం జారీ చేసింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మహిళలంతా తప్పనిసరిగా తలను వస్త్రంతో కప్పుకోవాలని ఆదేశించింది. బుధవారంనాటి సమావేశంలో ఖాప్ పంచాయతీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరైనా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే గ్రామం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ విషయంపై ప్రశ్నించేందుకు మోకిమ్, ముజాహిద్ అనే ఇద్దరు పంచాయతీ సభ్యులను పోలీసులు గురువారం పిలిపించారు. అయితే, వారిని విడి చిపెట్టాలంటూ అల్లరిమూక ఆందోళనకు దిగింది. అక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై కూడా అల్లరిమూక దాడి చేసింది. వారి ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టింది.


దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.పి.సింగ్ లక్నోలో తెలిపారు. ఇంత దుమారం చెలరేగినా యూపీ మంత్రి మొహమ్మద్ ఆజంఖాన్ మాత్రం ఖాప్ పంచాయతీ ఆదేశాలనే వెనకేసుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చని... దాన్ని ఎలా అడ్డుకుంటామని విలేకరులకు ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఇలాంటి ఆదేశాలను బలవంతంగా లేదా చట్టవ్యతిరేకంగా అమలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.


యూపీ సర్కారు చర్యలు తీసుకోవాలి: చిదంబరం

అసారా గ్రామ ఖాప్ పంచాయతీ ఆంక్షలను కేంద్ర హోంమంత్రి చిదంబరం తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చట్టవ్యతిరేక ఆదేశాలను అమలు చేయాలనుకునే వారిపై యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చిదంబరం శుక్రవారం చండీగఢ్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి వాటికి చోటు లేదన్నారు. ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ చీఫ్ మమతా శర్మ విచారం వ్యక్తం చేశారు. ఖాప్ పంచాయతీలకు రాజ్యాంగాధికారాలేవీ ఉండవన్నారు. ఆధునిక యుగంలో ఇటువంటి ఆదేశాలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు, ఈ విషయమై తక్షణమే నివేదిక సమర్పించవలసిందిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ బాఘ్‌పట్ జిల్లా అధికారులను ఆదేశించింది.

DRUGS LOW QUALITY

ఇదేమి మాత్ర.. వైకుంఠ యాత్ర

మందుల మాయా బజార్

7/14/2012 1:05:00 AM

2011 ఏప్రిల్ సంగతి. కాకినాడలో రేబిస్ సోకి 10 మంది మరణించారు. వారందరికీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్‌వీ) వేసినా ఫలితం లేకపోయింది. ఆ వ్యాక్సిన్ పని చేయకపోవడమే మరణానికి కారణమని అధికారులు కూడా ధ్రువీకరించారు. అయినా సరే, అదే నాసిరకపు మందు ఇప్పటికీ యథావిధిగా సరఫరా అవుతూనే ఉంది!

ఉసురు తీస్తున్న సర్కారీ దవాఖానా మందులు

మూడేళ్లుగా నాణ్యతా పరీక్షలకే దిక్కు లేదు
ల్యాబ్‌కు వెళ్లకుండానే రోగుల కడుపులోకి 205 రకాల మందుల్లో 75 శాతం ఇలాంటివే
ప్రాణాలు కాపాడే ఔషధాలపై పరీక్షలు కరువు
ఏ మాత్రమూ పట్టించుకోని సర్కారు
చోద్యం చూస్తున్న ఆరోగ్య శాఖ, డీసీఏ

గుండం రామచంద్రారెడ్డి

సర్కారీ ఆస్పత్రుల మందులు మింగడమంటే ఆరోగ్యంతో ప్రాణాంతక జూదమాడటంగా మారిపోయింది. జబ్బు నయమైందా.. రోగి అదృష్టం. లేదంటే ప్రాణాలు హరీ. పాశ్చాత్య దేశాల్లో పశువుల మందులను కూడా ప్రయోగశాలల్లో ఒకటికి పదిసార్లు పరీక్షించి గానీ మార్కెట్లోకి విడుదల చేయరు. కానీ మన రాష్ట్రంలోనేమో మనుషులకిచ్చే ఔషధాలకు కూడా పరీక్షలు జరిపే దిక్కు లేదు. పై ఉదంతంలోని రేబిస్ వ్యాక్సిన్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని సర్కారీ దవాఖానాల్లో వాడుతున్న 75 శాతం మందులదీ ఇదే పరిస్థితి! వాటికి పరీక్షలు జరుగుతున్నాయా, అవి నాణ్యమైనవేనా, వాడితే దుష్ఫలితాలొస్తున్నాయా, అసలా మందులు పనిచేస్తున్నాయా వంటి మౌలికాంశాలను కూడా సర్కారు పూర్తిగా గాలికొదిలేసింది. తయారీ సంస్థో, డిస్ట్రిబ్యూటరో ఇచ్చినవే మాత్రలు. వాటిని గుడ్డిగా కొనేయడం, నేరుగా పేద రోగులకు అంటగట్టడం.. ఇదే రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కర్తవ్యంగా మారింది. కనీసం వైద్య ఆరోగ్య శాఖ గానీ, ఔషధ నియంత్రణ సంస్థ గానీ దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నాణ్యతా పరీక్షలు పూర్తయి, నివేదిక వచ్చాకే మందులను రోగులకు సరఫరా చేయాలని చట్టం చెబుతున్నా వాటికి పట్టడం లేదు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో జనరిక్ మందులను తక్కువ ధరకే కొని కూడా విధిగా పరీక్షలు చేశాకే పంపిణీకి అనుమతిస్తుంటే.. మన దగ్గర మాత్రం ఎక్కువకు కొని, పరీక్షలే లేకుండా రోగుల మీదకు వదులుతున్నారు. ఇలాంటి నాణ్యత లేని మందుల వాడకం ఎక్కువై, దానివల్ల మూత్రపిండాల సమస్యలతో రోగులు అల్లాడుతున్నారని నివేదికలన్నీ ఘోషిస్తున్నా సర్కారులో మాత్రం స్పందన శూన్యం.

మూడేళ్లుగా పరీక్షలు నిల్


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారీ ఆస్పత్రులకు మందులను సేకరించి, సరఫరా చేసే బాధ్యత ఏపీఎంఎస్‌ఐడీసీది. సుమారు 205 రకాల సాధారణ మందులు, 28 రకాల యాంటీబయోటిక్స్ మందులు, 10 రకాల ఐవీ ఫ్లూయిడ్స్, 202 రకాల శస్త్రచికిత్సల ఉపకరణాలను ఇది సరఫరా చేస్తోంది. ఇందుకు ఏటా రూ.380 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటన్నింటికీ సంబంధించి ప్రతి బ్యాచ్‌నూ ముందే అనాలసిస్ (పరీక్ష)కు పంపి, అవి నాణ్యమైనవని తేలాకే రోగుల కోసం సరఫరా చేయాలి. కానీ గత మూడేళ్లుగా ఈ మందులు అసలు పరీక్షలకే నోచుకోవడం లేదు. జరిగిన ఒకటీ అరా పరీక్షలూ తూతూమంత్రంగానే ముగుస్తున్నాయి. పైగా వాటి ఫలితాలు కూడా రోగులు వాడిన ఏడాదికి గానీ రావడం లేదు! వాటిలో పలు మందులు నాణ్యమైనవి కావని తేలిన సందర్భాలకూ కొదవ లేదు. 2011లో విడుదలైన హెచ్‌ఐవీ టెస్ట్ కిట్‌లు, మిథైల్ ఎర్గోమెట్రైన్, రానిటిడైన్, సిప్రోఫ్లాక్సాసిన్, డొపామిన్, అమోక్సిసిలిన్ క్లావనిక్ వంటి మందులు నాసిరకపువని అవి మార్కెట్లోకి వెళ్లిన ఆర్నెల్ల తర్వాత నివేదికలు వచ్చాయి! ఆలోపు వాటిని వాడిన రోగుల పరిస్థితేమిటో ఆ దేవునికే తెలియాలి. ఇవే కాదు.. దీర్ఘకాలిక రోగాల నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను కూడా అసలు పరీక్షలకే పంపడం లేదంటే నమ్మి తీరాల్సిందే! కంపెనీలో తయారవడం, నేరుగా ఆస్పత్రులకు వెళ్లడం.. నిత్యం ఇదే తంతు. దీనిపై నిఘా వ్యవస్థ లేదు. నాణ్యతా పరీక్షల్లేవు. ఎవరూ ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. హెచ్‌ఐవీ రోగులకు వాడే ఎసిక్లోవిర్‌తో పాటు కళ్ల ఇన్‌ఫెక్షన్, గుండె సమస్యలు, గర్భకోశ వ్యాధులు, మధుమేహం, పాముకాటు తదితరాలకు వాడే అతి ముఖ్యమైన మందుల్లో 75 శాతం దాకా అసలు పరీక్షల ముఖమే చూడకుండా నేరుగా ప్రభుత్వాసుపత్రులకు, అక్కడ్నుంచి రోగుల కడుపులోకి వెళ్తున్నాయి! రాష్ట్రంలో ఉన్నవి రెండే ల్యాబొరేటరీలు. ఒకటి ఐటీఎల్, రెండోది పీఆర్‌కే. వీటిలో ఏటా 50 రకాలకు మించి నాణ్యతా పరీక్షలు జరగవంటే.. మన మందులను ఎంతమేరకు పరిశీలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పైగా ఏపీఎంఎస్‌ఐడీసీ పరిధిలో పనిచేస్తున్న అనాలసిస్ వింగ్‌కు అధికారే లేడు! టెండర్లకు సవాలక్ష నియమాలు పెట్టి, పలు కంపెనీలపై అనర్హత వేటు వేసి, అస్మదీయ కంపెనీలకు మాత్రమే ఆర్డర్లిచ్చే అధికారులు, సదరు మందుల అనాలసిస్‌కు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.


మాకు పంపడంలేదు

‘‘ప్రభుత్వాసుపత్రులకు సరఫరా అయ్యే మందులను డ్రగ్ కంట్రోల్ పరిధిలోని రెండు ల్యాబ్‌లను కాదని ప్రైవేటు ల్యాబ్‌లకు ఏపీఎంఎస్‌ఐడీసీ పంపుతోంది. కాబట్టి దాంతో మాకు సంబంధం లేదు’’
- ఆర్.పి.ఠాకూర్, ఔషధ నియంత్రణ శాఖ డెరైక్టర్ జనరల్

ల్యాబ్‌లకు వస్తున్నవి 30 శాతమే


‘‘రెండు ల్యాబ్‌లే ఉన్నందువల్ల మందుల పరీక్షల్లో జాప్యం (బ్యాక్‌లాగ్) ఏర్పడుతోంది. త్వరలో మరో 4 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని మందులనూ ల్యాబ్‌లకు పంపి, పరీక్షించాకే మార్కెట్లోకి అనుమతిస్తాం’’

-శ్రీనివాస్, బయోమెడికల్ ఇంజనీర్, అనాలసిస్ వింగ్ ఇన్‌చార్జి
ఎన్‌ఎస్‌క్యూ అంటే నాసిరకమైనవి (నాట్ స్టాండర్డ్ క్వాలిటీ). కానీ ఈ రిపోర్టులు వచ్చేనాటికే పై మందులన్నీ జనంలోకి వెళ్లి ఆరు నెలలు దాటింది!

అంటే దాదాపుగా 75 శాతం మందులు ప్రయోగశాలల ముఖమే చూడకుండా నేరుగా రోగుల కడుపులోకి వెళ్తున్నాయి

తమిళనాట ప్రతి మందూ పరీక్షకు వెళ్లాల్సిందే!

తమిళనాడులో ఒక్క మందు కూడా పరీక్ష జరగకుండా జనంలోకి వెళ్లదు. 6 నెలల ముందే మందులకు ఆర్డరిస్తారు. ఆ వెంటనే తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ వాటిని పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. ఇందుకు సొంతగా పెద్ద ల్యాబ్ ఉంది. ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ పరీక్షలకు అనుమతిస్తారు. మూడు నెలల్లోపే రిపోర్టులు వస్తాయి. ఆ తర్వాతే ఆస్పత్రులకు పంపిస్తారు. నాసిరకమని తేలితే తిప్పి పంపుతారు. ఇంతా చేసి మన రాష్ట్రంలో కంటే ప్రతి మాత్రనూ తమిళనాడులో 20 శాతం తక్కువ ధరకే

HUNT OF PSYCHO KONDAPALLI FORT







సైకో సాంబ కోసం విస్తృత గాలింపు

అన్వేషణలో 300మంది పోలీసులు

7/14/2012 1:13:00 AM

ఇబ్రహీంపట్నం(కృష్ణా), గుంటూరు, న్యూస్‌లైన్: రాచకుంట సాంబశివరావు అలియాస్ సైకో సాంబ పోలీసుల్ని పరుగుపెట్టిస్తున్నాడు. చిక్కినట్టే చిక్కి కొండపల్లి ఖిల్లాపై పరారైన సాంబశివరావు కోసం 300మంది గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిధిలో శుక్రవారం ముమ్మరంగా గాలించారు. సైకో తప్పించుకుని కొండపై నుంచి జారుకుంటూ కిందకు వెళ్లిపోయినట్లు నిర్ధారించారు.

ఖిల్లా పరిసర ప్రాంతాల గురించి అతనికి బాగా తెలిసి ఉంటుందని, అందుకే పోలీసులకు మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి పరారయ్యాడని భావిస్తున్న పోలీసు అధికారులు పరిసర గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. రిజర్వు ఫారెస్టుని ఆనుకుని ఉన్న మూలపాడు, జూపూడి, కేతనకొండ, పరిటాల, కంచికచర్ల, జి.కొండూరు తదితర గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అడవిలో ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా నిశితంగా పరిశీలించాకే వదలిపెడుతున్నారు. ఖిల్లాకు ఆనుకుని ఉన్న కాలనీల్లో కూడా వీఆర్వోల సాయంతో గాలిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలని కొండపల్లిలో దండోరా వేయించారు. కొండపల్లి ఎస్టీ కాలనీలో నేరస్వభావం కలిగిన కొందరు వ్యక్తులపై నిఘా వేశారు. గతంలో ఎన్‌కౌంటర్‌కు గురైన గజదొంగ అడపా వెంకన్న కొండపల్లిలో కొద్దిరోజులు తలదాచుకున్నాడు. ఖిల్లాపై పరారైన సాంబశివరావు కూడా కొండపల్లిలో ఎవరిదైనా సహకారం తీసుకుని ఉంటాడా.. అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.

కాళ్లకు బేడీలున్న వ్యక్తిని చూసిన మహిళ


కాళ్లకు బేడీలున్న ఒక వ్యక్తి శుక్రవారం సాయంత్రం కుంటుతూ అడవి నుంచి శాంతినగర్ మీదుగా వెళ్లటం చూసినట్లు ఒక మహిళ పోలీసు అధికారులకు తెలిపింది. నిందితుడు శాంతినగర్ వరకు వచ్చాడంటే రెలైక్కి పరారై ఉండవచ్చని, లేకపోతే విజయవాడ నగరం వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సైకో సాంబశివరావు తమ ప్రాంతంలో ఉన్నాడని మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అతడు మాయమైన ప్రదేశానికి సమీపంలోనే జూపూడిలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. సాం బశివరావు వ్యవహారంతో కళాశాలలకు వచ్చే విద్యార్థినులు భయపడుతున్నారు.


మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌కు నామమాత్రపు ఎస్కార్టా?


నాలుగు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న సాంబశివరావుకు పోలీసులు నామమాత్రంగా ఎస్కార్‌‌ట ఏర్పాటుచేసి తీసుకెళ్లడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 2005 నుంచి ఇప్పటివరకు 80కిపైగా కేసులు నమోదయ్యాయి. సైకోని పట్టుకుంది మంగళగిరి రూరల్ పోలీసులు కాగా అర్బన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రస్తుతం పోలీసు బాస్‌ల వద్ద పంచాయితీ సాగుతోంది. కాగా, కొండ పరిసర ప్రాంతాలు దట్టంగా ఉండటంతో కూంబింగ్‌కు కొంత ఇబ్బంది ఉందని, సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ రవికృష్ణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

ATTACK ON A GIRL ON ROAD

నడిరోడ్డుపై పైశాచికత్వం

టీనేజీ బాలికను వెంటాడి, దుస్తులు చింపిన ఆకతాయిలు

7/13/2012 11:59:00 PM

- అస్సాంలోని గువాహటిలో ఘోరం
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
-నలుగురు నిందితుల అరెస్ట్

గువాహటి: అస్సాంలో ఓ టీనేజీ బాలికపై 16 మంది ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. నడిరోడ్డుపై ఆమెను వెంటాడి, దుస్తులు చింపి పైశాచికానందం పొందారు. ఇంత జరుగుతున్నా స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన గువాహటిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గువాహటి-షిల్లాంగ్ రోడ్డులోని ఓ బార్‌లోకి ఐదుగురు పరిచయస్తులతో (ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు) కలసి ఓ బాలిక వెళ్లింది. అయితే అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బార్ సిబ్బంది వారిని బయటకు వెళ్లగొట్టారు.

ఈ పరిస్థితిని అదనుగా తీసుకున్న ఆకయితాలు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఈ వికృత చేష్టల వీడియో క్లిప్పింగ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడం...టీవీ చానళ్లు పదేపదే ఆ వీడియోను ప్రసారం చేయడంతో అస్సాం ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వరకూ నలుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఆలస్యంగా స్పందించారన్న మీడియా ప్రశ్నలపై అస్సాం డీజీపీ జయంతా నారాయణ్ చౌధురి మండిపడ్డారు. నేరం జరిగిన చోటల్లా వెంటనే ప్రత్యక్షం కావడానికి సాధ్యం కాదని, పోలీసులేమీ కోరిన వెంటనే నగదు అందించే ఏటీఎం కార్డుల వంటి వారు కాదని డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, డీజీపీ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి చిదంబరం ఖండించారు. బాలికపై వికృతచేష్ట ఘటనను ఎవరూ కూడా తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదని చిదంబరం చండీగఢ్‌లో వ్యాఖ్యానించారు.


ఈశాన్య రాష్ట్రాల యువతులపై దేశ రాజధానిలో జరిగే లైంగిక దాడులను పట్టించుకోని ఢిల్లీలోని మీడియా, తాజా ఉదంతంపై రాద్ధాంతం చేస్తోందని... అత్యాచారాలకు ఢిల్లీయే రాజధానిగా మారిందని మరో పోలీసు ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను కూడా చిదంబరం తప్పుబట్టారు. కాగా, అస్సాంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని..అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నా బృందం సభ్యుడు అఖిల్ గొగోయ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై విచారణకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

IAS SHALL BE SHOT DEAD

రోడ్డు మీద కాల్చేయాలి: టీజీ

అధికారులపై మంత్రి టీజీ తీవ్ర వ్యాఖ్యలు

7/14/2012 1:38:00 AM

వారికి తల బిరుసు, మాట వినరు.. కుర్చీలకు అతుక్కొని పోతారంటూ ఐఏఎస్‌లపై తీవ్ర విమర్శలు
పని చేయని వెధవలంతా హానెస్ట్ అనే బోర్డు తగిలించుకుంటారని వ్యాఖ్య
సీఎంకు, తమకు పనిచేయాలనే తపన ఉన్నా, ఐఏఎస్‌ల వల్లే ఇబ్బందులు వస్తున్నాయన్న మంత్రి వెంకటేష్

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: పని చేయని అధికారులను రోడ్డు మీద నిలబెట్టి కాల్చేయాలని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులపై ఒంటికాలి మీద లేచారు. ‘‘వారికి తల బిరుసు.. మాట వినరు.. కుర్చీలు వదలరు’’ అంటూ మండిపడ్డారు. పని చేయని వెధవలందరూ


నిజాయితీపరులుగా చలామణి అవుతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కర్నూలు నగరంలో కొత్తగా నిర్మించిన మైనర్ ఇరిగేషన్ శాఖ డీఈ కార్యాలయం భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులకు సమష్టిగా పనులు చేయాలనే తపన ఉన్నా, కొందరు ఐఏఎస్ అధికారుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పనులను వేగవంతంగా చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. అయితే, ఆర్థిక శాఖ మా స్పీడుకు బ్రేకు వేస్తోంది. అక్కడ ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్లు. వారికి తల బిరుసు. వారికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సరిగా మాట్లాడరు. మాట వినరు. ఏప్రిల్‌లో కేటాయించిన బడ్జెట్‌ను ఇప్పటికీ రిలీజ్ చేయకుండా తీవ్ర అలసత్వం చేస్తున్నారు’’ అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.


‘‘మైనర్ ఇరిగేషన్ శాఖలో ఒక పనికిమాలిన ఐఏఎస్ ఉంటే చాలు.. పనుల్లో న్యాయం చేయడానికి వీల్లేకుండాపోతోంది. ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ అమెరికా తరహాలో ఉండాలి. అమెరికాలో ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారుల వ్యవస్థను మారుస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కుర్చీలకు అతుక్కుకొని పోతున్నారు. ప్రజల కోసం ఎంతో చేయాలని మాకుంది. అయితే, ఇలాంటి వారి వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది. పని చేయని వెధవలంతా హానెస్ట్ అనే బోర్డు తగిలించుకొని కుర్చీలను వదలడంలేదు. ఇలాంటివారికి జీతాలు ఇవ్వడం దండగ’’ అని తీవ్రంగా విమర్శించారు.

వీటికి పరిష్కారం కావాలంటే చట్టంలో మార్పులు చేయాలని చెప్పారు. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ మధ్య సమన్వయంలేకపోవడంవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లాలో చెరువు కోసం పుల్లారెడ్డి అనే వ్యక్తి 350 ఎకరాలు దానం చేస్తే, అధికారుల తప్పిదాల వల్ల ఇప్పటికీ చెరువును తవ్వుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఆ భూమి స్వాధీనానికి సంబంధించిన ఫైల్‌ను మూలన పడేశారని, దాని కోసం మా స్థాయిలో ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

VEGETABLES ON TERRACE




గజం స్థలంలో 288 మొక్కలు

ఇంటి పంట



ఇది ‘పెరటి మొక్కల పొద’ మ్యాజిక్
ముచ్చటగొలుపుతున్న ‘పెరటి మొక్కల గోడ’!
అర్బన్ కిచెన్ గార్డెన్‌కు
అధునాతన అన్‌బ్రేకబుల్ కుండీల సొబగు

నాలుగు కూరగాయ మొక్కలో, ఆకుకూరలో ఇంటి పట్టున పెంచుకుందామంటే పెద్దగా చోటు లేదని చింతిస్తున్నారా? బాల్కనీలో ఉన్నదల్లా రెండు గజాల స్థలమే. ఆ కాస్త ఖాళీలో ఎన్ని కుండీలు పెట్టగలం.. ఎంతని ఆకుకూరలు పెంచగలం అననుకుంటున్నారా..?

ఇదుగో చక్కటి ఉపాయం... వర్టికల్ పెరటి తోట!

అరకిలో బరువుండే చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలు ఉంటాయి. వాటిని పట్టి ఉంచడానికి కొన్ని ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరికి వారు ‘పెరటి మొక్కల పొద’ (బయో వాల్)లను, ‘పెరటి మొక్కల గోడ’ (గ్రీన్ వాల్)లను పదంటే పది నిమిషాల్లో సృష్టించుకోవచ్చు.
ఆకారం, ఎత్తు, పొడవు, వెడల్పు.. ఎలా కావాలంటే ఆ విధంగా కుండీలను అమర్చుకునే వీలుంది. గుండ్రంగా పొద మాదిరిగా ఫ్రేమ్స్‌ను కలిపి, చుట్టూ ప్లాస్టిక్ కుండీలు తగిలించవచ్చు. లేదంటే ప్లైవుడ్‌కు ఈ ఫ్రేమ్స్‌ను కోరిన వెడల్పు, ఎత్తు, పొడవులలో సులువుగా బిగించుకోవచ్చు. తర్వాత చిటికెలో కుండీలు తగిలించవచ్చు.

వారానికో, నెలకో.. మీకు తోచినప్పుడు ఈ ఫ్రేమ్స్‌ను మార్చి.. మీ అత్యాధునిక పెరటి తోటకు పది నిమిషాల్లో కొత్త రూపు దిద్దుకోవచ్చు. ఈ మార్పులన్నీ నిపుణులెవరో వచ్చి చెయ్యక్కర్లేదు. ఫ్రేమ్‌ల అమరికను ఒక్కసారి పరికించి చూస్తే చాలు.. ఎవరికివారే పెరటి తోటను బిగించుకోవచ్చు!

అన్నిటికీ మించి.. ప్రస్తుతం కొద్ది రోజులు ఏ పెరటి తోటా వద్దు అనుకుంటే... ఫ్రేమ్‌లను, కుండీలను తీసేసి.. ప్యాక్‌చేసి అటకపై దాచిపెట్టుకోవచ్చు. మళ్లీ ఎప్పుడంటే అప్పుడు పది నిమిషాల్లో బిగించుకొని.. ఆకుకూరల విత్తనాలో, కూరగాయల విత్తనాలో చల్లుకోవచ్చు. మధ్యలో పూలమొక్కలూ పెట్టుకోవచ్చు.

సులువుగా మార్చుకోవచ్చు

ఇంటి పెరటిలోనో, ఇంటి పైనో, అపార్ట్‌మెంట్ల బాల్కనీల్లో.. ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ బయో వాల్స్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి హాల్‌లో (నీడ పట్టున) అందంగా ‘ఫ్రేమ్ గార్డెన్’ను గోడకు వేలాడదీయొచ్చు. అటువంటి ఫ్రేమ్‌లు మరి కొన్నిటిని ఆరుబయటో, బాల్కనీల్లోనో (ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు రోజులు నీడ పట్టున ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను ఎండ తగిలే చోటుకు తరలించి.. ఎండ తగిలే చోట ఫ్రేమ్‌లకు ఉన్న మొక్కల కుండీలను నీడపట్టున ఫ్రేమ్‌లకు అతి సులువుగా తగిలించుకోవచ్చు.

ముంబైకి చెందిన జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ఈ సరికొత్త ఆలోచనతో అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌కు రూపకల్పన చేసింది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఉద్యాన ఎక్స్‌పోలో ఈ ఫ్లెక్సిబుల్ వర్టికల్ గార్డెన్ సిస్టమ్స్‌ను దేశంలోనే మొట్టమొదటి సారిగా జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రదర్శించింది.

6 అంగుళాల కుండీ!

అర్బన్ గార్డెనింగ్ గ్రీన్ వాల్‌లో ఫ్రేమ్‌కు అమర్చే కుండీ చేతిలో అమిరిపోయేంత చిన్నది. దీని లోతు 6 అంగుళాలు, వెడల్పు 4 అంగుళాలు. మట్టి, మొక్కతో కలిపి ఒక్కో కుండీ బరువు అర కేజీకి మించదు. ఒక్కో ఫ్రేమ్‌కు 3 కుండీలుంటాయి. అటువంటి ఫ్రేమ్‌లను ఎట్లా కావాలంటే అట్లా అమర్చుకోవచ్చు.

కొబ్బరి పొట్టు ఎరువు బెస్ట్

శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును వాడి నిక్షేపంగా మొక్కలు పెంచుకోవచ్చునని కోనసీమలో నర్సరీల వాళ్లు అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కొన్ని కంపెనీలు శుద్ధిచేసిన కొబ్బరి పొట్టు ఎరువును మార్కెట్లో విక్రయిస్తున్నాయి కూడా.

గజం వర్టికల్ గార్డెన్‌లో 288 మొక్కలు..!

ఒక్కో ఫ్రేమ్ (3 ఖాళీ కుండీలతో కలిపి) 570 గ్రాముల బరువు ఉంది. కొబ్బరి పొట్టులో చిన్న మొక్కను ఉంచిన తర్వాత ఒక్కో ఫ్రేమ్ బరువు కిలోన్నర ఉంది. అంటే మొక్క ఉన్న ఒక్కో కుండీ బరువు అర కేజీ అన్నమాట. 4 ఫ్రేమ్‌లను (అంటే 12 మొక్కలను) అమర్చేందుకు 3 అడుగుల స్థలం సరిపోతుంది. 16 ఫ్రేమ్‌లను గుండ్రంగా అమర్చి.. వాటిపై 6 వరుసలుగా ఫ్రేమ్‌లను నిలువుగా బిగిస్తే (288 కుండీలతో).. చదరపు గజం స్థలంలోనే దాదాపు 9 అడుగుల ఎత్తులో ‘పెరటి మొక్కల పొద’ (వర్టికల్ గార్డెన్) తయారవుతుంది. గుండ్రంగా ఉండే ఈ ‘పెరటి మొక్కల పొద’ను అన్ని వైపుల నుంచి ఎండ తగిలే వీలున్న ఆరుబయటో, మేడ మీదో ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది.

వాల్ గార్డెన్ సంగతి..
ఫ్రేమ్‌లను రెండు వరుసలుగా ప్లైవుడ్‌కు బిగిస్తే వాల్ గార్డెన్ సిద్ధం. ఉదయం గాని, మధ్యాహ్నం నుంచి గాని రోజుకు ఐదారు గంటలు ఎండ తగిలే చోట గోడకు ఆనించిన ప్లైవుడ్‌కు ఫ్రేమ్స్ బిగించి కుండీలు పెట్టుకుంటే చాలు. ఆకుకూరలు, కూరగాయల సాగుకు ఈ చిన్న కుండీలు భేషుగ్గా ఉంటాయనడంలో సందేహం లేదు.

విలక్షణమైన గ్రీన్‌వాల్

మరో విలక్షణ నమూనా వాల్ గార్డెన్‌ను కూడా ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. 16 మొక్కలు పెంచుకోవడానికి వీలుగా ఉండే ట్రే(మాడ్యూల్)లను తయారుచేసింది. 12.5 సెంటీమీటర్ల మందాన ఉండే ట్రేలో కొబ్బరి పొట్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెట్టుకున్న తర్వాత.. దాన్ని గోడ పక్కన నిలబెట్ట వచ్చు. ఆకాశం వైపు చూడాల్సిన మొక్కలు... అడ్డంగా వంగి పక్కకు పొడుచుకొచ్చినట్టుంటాయి. ట్రేని అలాగే ఉంచి పై నుంచి లోపలికి నీరు పోయవచ్చు.

‘అన్‌బ్రేకబుల్ మెటీరియల్‌తో తయారుచేశాం’

(12 కుండీలను కలిగి ఉండే) 4 ఫ్రేమ్‌ల ప్యాకెట్ ఖరీదు పన్నులతో కలిపి రూ.900. రవాణా ఖర్చులు, ఆక్ట్రాయ్ అదనం. మొదటి ఎక్స్‌పోలోనే తమ ఉత్పత్తులు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయని జేకేడీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ యజమాని కుమార్‌పాల్ షా ‘ఇంటి పంట’ ప్రతినిధితో చెప్పారు. బయో వాల్‌ను ఎండలో పెట్టుకున్నా ఏళ్ల తరబడి మన్నిక ఉండేలా, అన్‌బ్రేకబుల్‌గా, నాణ్యంగా తయారుచేశామని ఆయన తెలిపారు. తమకు దేశంలో ఎక్కడా డీలర్లు లేరని, వినియోగదారులు తమను నేరుగా (022- 23713340, 32923340) సంప్రదించవచ్చన్నారు.

(రేపు మళ్లీ ఇక్కడే కలుద్దాం)

- ‘సాక్షి’ స్పెషల్ డెస్క్

‘ఇంటి పంట’ల సాగు ఎంతో మేలు

నేడు ప్రపంచ పెరటి తోటల దినోత్సవం



కూరగాయలు, పండ్లలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు ప్రజారోగ్యానికి గొడ్డలి పెట్టులా తయారయ్యాయన్న స్పృహ వినియోగదారుల్లో పెరుగుతోంది. ఈ దృష్ట్యా స్థలాభావం ఉన్నప్పటికీ.. ఇంటి ముందో, వెనుకో, మేడ మీదో, బాల్కనీలోనో కుండీలు, మడుల్లో ఉన్నంతలో ఆరోగ్యదాయకంగా కూరగాయలు పెంచుకుందామన్న ప్రయత్నాలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇటీవల ముమ్మరమయ్యాయి.

2008 లెక్కల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికులు పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన దేశంలో 30 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారని తాజా అంచనా. మరో 25 ఏళ్లలో ఇది 50 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి లెక్కగడుతోంది. వ్యవసాయానికి దూరంగా ఇంత ఎక్కువ మంది పట్టణాలు, నగరాల్లో జీవిస్తుంటే.. ఆహారోత్పత్తి, ఆహార రవాణా, ఆహార వ్యవస్థల నిర్వహణపై వత్తిడి ఎంత తీవ్రంగా పెరుగుతుందో వేరే చెప్పనక్కరలేదు. ఈ వత్తిడిని కొంత మేరకైనా తగ్గించడానికి అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహించడం అత్యవసరం. పట్టణాలు, నగరాల్లో నివసిస్తూ కూడా ఇప్పటికే 80 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో ఇంటి పంటల సాగు చేపట్టారని ఒక అంచనా. భారతీయ గృహాల్లో తలసరి పౌష్టికాహార వినియోగం తక్కువగా ఉండడం.. పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్న జనాభా సంఖ్య పెరుగుతున్నందున అర్బన్ అగ్రికల్చర్‌ను ప్రోత్సహించాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది.


సేంద్రియ ‘ఇంటి పంట’ల సాగును వ్యాప్తిచేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఉద్యమ స్ఫూర్తితో కృషి చేస్తున్నారు. ముంబై నగరంలో ముంబై పోర్టు ట్రస్టు మేడల మీద, పబ్లిక్ పార్కుల కేంద్రంగా సిటీ ఫార్మింగ్‌లో ఆచరణాత్మక శిక్షణను అర్బన్ లీవ్స్ ఇండియా ట్రస్టు నిరంతరం చేపడుతోంది. కంపోస్టు తయారీ నుంచి వివిధ పంటల సాగు వరకూ అత్యాధునిక మెళుకువలను నగరవాసులకు పరిచయం చేస్తోంది.


బెంగళూరులో ఈ దిశగా గత కొన్ని సంవత్సరాలుగా గార్డెన్ సిటీ ఫార్మర్స్ ట్రస్టు, అమి ఫౌండేషన్, విఠల్ మాల్య సైంటిఫిక్ రీసెర్చ్ ఫౌండేషన్, డాక్టర్ విశ్వనాధ్ తదితరుల ఆధ్వర్యంలో మేడలపై, బాల్కనీల్లో సేంద్రియ పెరటి తోటల సాగుపై చక్కని కార్యసదస్సులు క్రమం తప్పకుండా సాగుతున్నాయి. హుబ్లీలో దేశ్‌పాండే ఫౌండేషన్ విశేష కృషి చేస్తోంది. ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆసక్తి ఉన్న యువతను ఇంటి పంటల కన్సల్టెంట్లుగా తీర్చిదిద్దుతోంది.


తిరువనంతపురం నగరంలో ఈ ఏడాది ఆగస్టు 2న కేరళ హార్టీకల్చర్ మిషన్ ఆధ్వర్యంలో రూ.12 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో కూరగాయల సాగుపై వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. నగరపాలక సంస్థ తొలి దశలో 15 వేల ఇళ్ల మేడలపై కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ప్రతి ఇంటికీ కూరగాయ మొక్కల సాగుకు 25 సిల్ఫాలిన్ బ్యాగులు, విత్తనాలు లేదా నారు, గార్డెనింగ్ పరికరాలు ఉచితంగా అందజేస్తున్నారు. కాలనీ సంఘాల ద్వారా ఆసక్తి ఉన్న గృహస్తులను ఎంపిక చేస్తున్నారు. నగరంలో మేడలపై కూరగాయల సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక డాక్యుమెంటరీలను అందుబాటులో ఉంచడం, సేంద్రియ సేద్యంలో అనుభవం ఉన్న నిపుణుల సలహాలను అందుబాటులోకి తేవడం ద్వారా కేరళ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది.


‘సాక్షి’ ప్రచార యజ్ఞం


‘ఇంటి పంట’ల ప్రచార యజ్ఞంతో ‘సాక్షి’ దినపత్రిక వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టింది. సేంద్రియ ఇంటి పంటల సాగులో శాస్త్రీయ మెళుకువలను, వినూత్న పోకడలను.. వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ పద్ధతులను ‘ఇంటి పంట’ శీర్షిక పాఠకులకు పరిచయం చేసింది. హైదరాబాద్ మహా నగరంలోని 15 ప్రాంతాల్లో కార్య సదస్సులను నిర్వహించడంతో వేలాది ప్రజలు ఇంటి పంటల సాగుపై దృష్టిసారించారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ), అగ్రి హార్టికల్చరల్ సొసైటీ, హైదరాబాద్ గోస్ గ్రీన్ తదితర సంస్థల నిపుణులు ప్రజలను చైతన్య పరిచే కృషిలో పాలుపంచుకున్నారు. గూగుల్ గ్రూప్.కామ్‌లో ఇంటి పంట గ్రూప్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇంటి పంటల సాగుదారులకు ఇంటర్ నెట్‌లో అనుభవాలు పంచుకునే అవకాశం వేదిక అందుబాటులోకి వచ్చింది. అర్బన్ అగ్రికల్చర్‌పై ప్రత్యేక శిక్షణా విభాగాలను ప్రారంభించేందుకు సీఎస్‌ఏ, ధ్యానహిత సొసైటీ తదితర సంస్థలు ప్రయత్నిస్తుండడం విశేషం.


నివాస గృహాల వద్ద, హౌసింగ్ కాలనీలు, పాఠశాల లు, కళాశాలల వద్ద ఖాళీస్థలాల్లో సేంద్రియ పెరటి తోట లు సాగుచేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నర్సరీని అర్బన్ అగ్రికల్చర్ నమూనా వనరుల కేంద్రంగా అభివృద్ధి చేయడం ప్రయోజనకరం. రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లోని పార్కులలో అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ విభాగాలను, నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉపక్రమిం చాలి. ఈ విషయంలో కేరళ ప్రభుత్వ కృషిని మన రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.


-పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్



వంటే కాదు.. పంటలూ ఇంటివే

సాక్షి ‘ఇంటి పంట’ స్ఫూర్తితో ఉద్యాన శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం

7/14/2012 12:59:00 AM

ఏడాది పొడవునా అందుబాటులో రసాయనాలులేని కూరగాయలు
మేడలపై కూరగాయల సాగుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్ లో కిచెన్ గార్డెన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
లబ్ధిదారుల ఇంటి వద్దకే విత్తనాలు, ఇతర ఉపకరణాలు
యూనిట్ వ్యయం రూ.14 వేలు.. 50% సబ్సిడీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరవాసులు ‘ఆహా.. ఏమి రుచి’ అని కూరగాయల గురించి అనుకోవడం ఎప్పుడో మరచిపోయారు. ఒకపక్క విపరీతంగా పెరిగిన ధరలు.. పూర్తిగా రసాయనాల వినియోగంతో పెరిగిన కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో కమ్మని కూరగాయల కోసం తపనపడేవారికి ఓ శుభవార్త. ఆరోగ్యదాయకమైన కూరగాయలు తమకు అందుబాటులో ఉంచుకునే అవకాశం జంటనగరాల ప్రజలకు అందివస్తోంది. స్వల్ప పెట్టుబడి.. కాస్త ఆసక్తితో పాటు కొంత సమయం వెచ్చిస్తే చాలు... కోరుకున్న కూరగాయలు తాజాగా రెడీయన్నమాటే. ‘ఇంటి పంట’ పేరిట ‘సాక్షి’ గత ఏడాది ప్రారంభించిన ప్రచారోద్యమం సాధించిన విజయం ఇది. ‘ఇంటి పంట’ శీర్షిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది ఇంటిపట్టునే కూరగాయల సాగును ప్రారంభించారు. దీనిపై హైదరాబాద్ నగరవాసులకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ‘సాక్షి’ నిర్వహించిన ‘ఇంటి పంట’ వర్క్‌షాపులు నగరవాసుల్లో ఆరోగ్యదాయకమైన ఆహారంపై ఆసక్తిని రేకెత్తించాయి. ‘ఇంటి పంట’ స్ఫూర్తితో రాష్ట్ర ఉద్యాన శాఖ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో నగరవాసులు తమ దాబాల టైపై కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చింది.
50 శాతం సబ్సిడీ


దేశంలోనే తొట్టతొలిగా హైదరాబాద్ నగరంలో మేడలపై కూరగాయల సాగు ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్టు మంజూరైంది. ఇందుకోసం రూ.3.39 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పైలట్ ప్రాజెక్టును శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ సి.వి.ఎస్.కె.శర్మ, ఉద్యాన శాఖ కమిషనర్ రాణి కుముదిని పబ్లిక్ గార్డెన్స్‌లోని హార్టీకల్చర్ ట్రైనింగ్ సెంటర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. కాలనీ సంక్షేమ సంఘాల ద్వారా ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులను గుర్తించి, నర్సరీ ఏజన్సీల ద్వారా కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు రాణి కుముదిని వెల్లడించారు. కాగా నలుగురు కుటుంబానికి ఏడాదికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు లభించేలా మేడపైన వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో (ఒక యూనిట్) టై కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు రూ.14 వేలు ఖర్చవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. లబ్ధిదారులు తమ వంతుగా రూ. 7 వేలను తమ ప్రాంతంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీ ఏజన్సీకి చెల్లించి, మేడపై కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేయించుకోవాలి. ఇలా ఏర్పాటైన గార్డెన్లు సత్ఫలితాలనిస్తున్నాయని నిర్థారించుకున్న తర్వాత ఈ ఏజన్సీలకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.7 వేల చొప్పున సబ్సిడీ (50%)ని చెల్లిస్తుంది.


ఇంటి వద్దకే విత్తనాలు, కంపోస్టు, ఇతర సామగ్రి


ఈ పథకంలో విత్తనాలు, కంపోస్టు- మట్టి మిశ్రమం కోసం, ఇటుకలు, ఇతరత్రా పరికరాల కోసం నగరంలో ఎక్కడెక్కడో వెదుక్కోవాల్సిన శ్రమ లేదు. వాస్తవానికి చాలామందికి ఇందుకు సంబంధించిన దుకాణాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. ఈ కారణంగానే ఆసక్తి ఉన్నా వెనుకంజ వేసేవారు. ఇప్పుడు మాత్రం కిచెన్ గార్డెన్‌కు అవసరమయ్యే ఉపకరణాలతోపాటు సాంకేతిక సలహాలను కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకు వచ్చి అందించే అవకాశాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కల్పిస్తోంది. ఉద్యాన శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సంయుక్తంగా అమలు చేసే ప్రాజెక్టు కింద కాలనీ సంక్షేమ సంఘాల ద్వారా లబ్ధిదారులను గుర్తించి, నర్సరీ ఏజన్సీల ద్వారా కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయిస్తారు. లబ్ధిదారులు పబ్లిక్ గార్డెన్స్ ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే చాలు. కావాల్సిన కంపోస్టు, మట్టి, విత్తనాలు, ఇటుకలు తదితర ఉపకరణాలన్నిటినీ ఈ నర్సరీ ఏజన్సీలే మొబైల్ వ్యాన్ల ద్వారా సమకూర్చుతాయి. లబ్ధిదారులకు తొలుత శిక్షణ ఇవ్వడంతో పాటు తదనంతరం పాటించాల్సిన సాంకేతిక సలహాలు కూడా అందిస్తాయి. నెలకోసారి ఈ ఏజన్సీ ప్రతినిధులు ప్రతి గార్డెన్‌ను సందర్శించి తగిన సూచనలతోపాటు కంపోస్టు తదితరాలను అందిస్తారు.


నగరంలో ప్రాంతాల వారీగా నర్సరీ ఏజన్సీలను వారం రోజుల్లోగా గుర్తించి ఆయా ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్ల వద్ద జాబితాలను పొందుపరుస్తామని ఉద్యానశాఖ కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. విభిన్న జీవన నేపథ్యం నుంచి వచ్చిన నగరవాసులకు కూరగాయల పెంపకంలో శిక్షణ ఇవ్వడంతో ద్వారా ఏడాది పొడవునా తోడ్పాటును అందించాలన్నదే ఈ పైలట్ ప్రాజెక్టు ఉద్దేశమని ఆమె వివరించారు. ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచడం ద్వారా నగరాన్ని ఎడిబుల్ సిటీగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. సాక్షి ప్రారంభించిన ‘ఇంటి పంట’ గూగుల్ గ్రూప్స్ (intipanta@ googlegroups.com) ద్వారా కిచెన్ గార్డెనింగ్‌పై ఆచరణాత్మకమైన సలహాలు అందుతున్నాయని ఆమె ప్రశంసించారు.


ఈ కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ అనూరాధ, ఉద్యానశాఖ డిప్యూటీ డెరైక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలువురు ‘ఇంటిపంట’ గూగుల్ గ్రూప్స్ సభ్యులు పాల్గొన్నారు. ‘ఇంటి పంట’ శీర్షికన సాక్షి ప్రచురించిన వ్యాసాలను సాక్షి వెబ్ సైట్ (sakshi.com)హోమ్ పేజీలో ‘ఇంటి పంట’ లోగోను క్లిక్ చేయడం ద్వారా చదవొచ్చు.

Sunday 24 June 2012

RAVE PARTY



«ÕŸ¿u¢, «ÕÅŒÕh, «Õ’¹Õ«©Åî ¤ÄKd©Õ.. ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ.. «uGµÍê½¢.. J²Äª½Õd©ä •©Çq ꢓŸÄ©Õ... ¨„ç¢{x ²ÄnªáÂË «ÖŸ¿Â¹“Ÿ¿„Ãu© „Ãu¤Äª½¢ å£jÇŸ¿ªÃ¦ÇŸþ©ð N¹%-ÅŒ ®¾¢®¾ˆ%A å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ Ð -ÊÖu®ý-{Õ-œä
å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ GµÊo ®¾¢®¾ˆ%-Ōթ ®¾„äÕt-@Á-Ê¢.. Ưä¹ ª½Âé ®¾¢®¾ˆ%-ÅŒÕ-©Õ ƒÂ¹ˆœ¿ «ÕÊÂ¹× Ÿ¿ª½z-Ê-NÕ-®¾Õh¢šÇªá.. ‡«J ®¾¢®¾ˆ%AE „ê½Õ ‡¢Åî ’íX¾p’à “X¾Ÿ¿-Jz-®¾Õh¢šÇ-ª½Õ. „ÚËE Æ¢Ÿ¿ª½Ö ‚²Äy-C²Äh-ª½Õ... Æ©Ç¢šË ÆŸ¿Õs´ÅŒ Ê’¹ª½¢©ð ƒX¾Ûpœî -N¹%-ÅŒ ®¾¢®¾ˆ%A X¾Ûª½Õ-œ¿Õ-¤ò-®¾Õ-¹עC.. §Œá«Åä ©Â¹~u¢’à «ÕŸ¿u¢, «ÕÅŒÕh, «Õ’¹Õ«-©-Åî-œ¿Õ’à ¨„ç¢{x æXª½ÕÅî «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© «ÖX¶Ï§ŒÖ X¾JÍŒ§ŒÕ¢ Íä®ÏÊ ¨ ꪄþ ¤ÄKd© ®¾¢®¾ˆ%A Ê’¹ªÃEo B“«¢’à ¹©Õ†ÏÅŒ¢ Íä²òh¢C. å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ P„ê½Õ©ðE XÏUx-X¾Ü-ªý©ð …Êo ŠÂ¹ J²Äª½Õd©ð •JTÊ êª„þ ¤ÄKd ŸÄE N¹%-ÅŒ-ª½Ö-¤Ä-Eo ¦§ŒÕ-{-åX-šËd¢C. ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ, «uGµÍê½¢ ‚Ê„Ã@ÁÙx ƹˆœË N†¾ ®¾¢®¾ˆ%AE ¹@Áx-¹×¹-šÇdªá. ¤òM®¾Õ©Õ ꪄþ ¤ÄKdE ¦µ¼’¹o¢ Íä®Ï «ÕÅŒÕh©ð èð’¹Õ-ÅŒÕ-Êo §Œá«ÅŒÊÕ, ƪ½nÊ’¹o Ê%ÅÃu©Õ Í䮾ÕhÊo Æ«Ötªá©ÊÕ ÆŸ¿Õ-X¾Û-©ðÂË B®¾Õ-Âî-«-œ¿¢, ’¹Õ{Õd-ª½{Õd Í䧌՜¿¢Åî ®¾J¤ò-ªá¢C-’ÃF...©ä-Ÿ¿¢˜ä ¨ ®¾¢®¾ˆ%A «ÕJ¢ÅŒ’à éª*a-¤ò-§äÕŸä... -å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ꪄþ ¤ÄKd©Õ ƒšÌ«-L-ÂÃ-©¢©ð ’¹Õ{Õd’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ão ÂíCl ¯ç©© ÊÕ¢* ¨„ç¢{x ²ÄnªáÂË ‡C’êá. Ÿ¿ÂË~ºÇC ªÃ³ÄZ©ðx ’î„à ŌªÃyÅŒ å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-ÊÕ ê¢“Ÿ¿¢’à Í䮾Õ-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× Âí¢Ÿ¿ª½Õ “œ¿’û «ÖX¶Ï§ŒÖ Mœ¿ª½Õx “X¾§ŒÕ-ÅÃo-©Õ Í䮾Õh¢œ¿’Ã.. ÂíCl ¯ç©© “ÂËÅŒ¢ ÊÕ¢* ꪄþ ¤ÄKd© æXª½ÕÅî ¨„碚ü „äկ䕪½Õx “X¾„ä-P¢ÍÃ-ª½Õ. Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢Åéðx ®¾¢UÅŒ „êáŸÄu© èðª½Õ©ð ªÃ“ÅŒ¢Åà OšËE Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ƒšÌ«© ¤òM®¾Õ©Õ X¾{Õd-¹×-ÊoC 骢œ¿Õ Íî˜ãkx¯Ã... Æ¢ÅŒÂ¹× «á¢Ÿ¿Õ ¯Ã©Õé’jŸ¿Õ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx ²òŸÄ©Õ Eª½y-£ÏÇ¢Í䢟¿Õ-Â¹× „ç@Áx’à *«J ENÕ†¾¢©ð EªÃy-£¾Ç-¹×-©Õ ÅŒXÏp¢ÍŒÕ-Âî-«-œ¿¢Åî X¾{Õd-Âî©ä-¹-¤ò-§ŒÖ-ª½Õ. ÂíClªîV© “ÂËÅŒ¢ ‰XÔ‡©üÐ5 ®¾¢Ÿ¿-ª½s´¢’à Âí¢Ÿ¿ª½Õ “ÂËéÂ{ª½Õx ꪄþ ¤ÄKd©ð ¤Ä©ï_-Ê-œ¿¢, ÆʢŌª½¢ «á¢¦ªá V£¾Ý©ð 44 «Õ¢CE ¤òM®¾Õ©Õ Æ骮ýd Í䧌՜¿¢Åî å£jÇ-Ÿ¿-ªÃ-¦ÇŸþ ¤òM®¾Õ©Õ Æ“X¾-«Õ-ÅŒh-«Õ-§ŒÖu-ª½Õ. Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢ÅÃ-©ðx-ÊÖ ¤ÄKd©Õ ÂíʲÄ-’¹Õ-ÅŒÕ-¯Ão-§ŒÕÊo ®¾«Ö-ÍÃ-ª½¢Åî ÆÊÕ«ÖÊ¢ …ÊoÍî{x ÅŒE&©Õ Eª½y-£ÏÇ¢Íê½Õ. „ê½¢ÅÃ-©ðx ¨ ÅŒE&©ÊÕ ÂíʲÄ-T-®¾Õh-¯Ão-ª½Õ. ®¾¢U-ÅŒ¢... Ê%ÅŒu £¾Çô-ª½Õ
-§Œá-«B §Œá«Â¹×©Õ ¹©®Ï £¾Çô-éª-Åäh ®¾¢UÅŒ¢©ð „çÕi«ÕJ* Ê%ÅŒu¢ Í䧌՜¿„äÕ êª„þ ¤ÄKd. ƒ¢’¹x¢œþ ÊÕ¢* ®¾J£¾Ç-Ÿ¿Õl-©-ÊÕ ŸÄšË ÆC ƒÂ¹ˆœËÂË «Íäa®Ï¢C. ’î„Ã, «á¢¦ªá, œµËMx©ðx ÅŒª½ÍŒÖ •Jê’ êª„þ ¤ÄKd©Õ ’î„à OÕŸ¿Õ’à å£jÇ-Ÿ¿-ªÃ-¦Ç-Ÿþ-Â¹× ÍäªÃªá. ¯çj°-J-§ŒÕ-ÊÕx, Âí¢Ÿ¿ª½Õ ¨„碚ü „äկ䕪½Õx OšËE Ê’¹ª½¢, P„ê½Õ “¤Ä¢Åéðx «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ NE§çÖT¢Íä ¹®¾d-«Õ-ª½xÂ¹× X¾JÍŒ§ŒÕ¢ Íä¬Çª½Õ. ¦¢èÇ-ªÃ-£ÏÇ-©üq, WHx£ÏÇ-©üq, «ÖŸÄ-X¾Ü-ªý-©-©ðE “X¾«áÈÕ© ƒ@ÁÙx, J²Äªýd©©ð “X¾A „êâŌ¢©ð-ÊÖ Eª½y-£ÏÇ¢Íä-„ê½Õ. ꪄþ ¤ÄKd Eª½y£¾Çº Æ¢˜ä ‚³Ä«Ö†Ô’à …¢œ¿Ÿ¿Õ. ‡¢Åî ¹®¾ª½ÅŒÕh Í䧌ÖL. ®¾JÂíÅŒh ®¾¢UÅŒ X¾J¹ªÃ©Õ …¢ÍÃL. «Õªî ©ð¹¢©ðÂË B®¾ÕéÂ@ìx «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ ÅŒX¾pE®¾J. N¬Ç©„çÕiÊ £¾É©ÕÊÕ „äC¹’à Í䮾Õ-¹×-¯Ão¹ å®jÂîœç-LÂú, ˜ãÂîo-®¾¢U-ÅŒ¢, ©ä•-ªý©ãj-{Õx, “X¾Åäu¹ “X¾¦µÇ«¢ ÍŒÖXÏ¢Íä ®¾¢UÅŒ, NŸ¿ÕuDl¤Ä© ÂâA …¢{Õ¢C. ‡¢œÎ‡¢\, ‡©ü‡®ýœÎ «¢šË «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©-ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{թ𠅢͌Õ-ÅÃ-ª½Õ. X¶¾Õ-¯Ã-£¾É-ª½¢ ‡Â¹×ˆ«’à B®¾Õ-Âî-¹עœÄ XÏèÇb, “Ÿ¿„Ã-£¾É-ª½¢, ͌鈪½ ‡Â¹×ˆ«’à …Êo ¤ÄF§ŒÖ©ÊÕ Æ¢Ÿ¿Õ-¦Ç-{թ𠅢͌Õ-ÅÃ-ª½Õ. ªÃ“A 10 ’¹¢{© ÊÕ¢* Åç©x„ê½Õ èÇ«áÊ 3, 4 ’¹¢{© «ª½Â¹Ø ¤ÄKd ÂíʲÄ-’¹Õ-ŌբC. ’î„Ã, «á¢¦ªá ©Ç¢šË “¤Ä¢Åéðx ÂíEo “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx 24 ’¹¢{©Ö ÂíʲÄ-’¹Õ-ŌբšÇªá. ꪄþ-¤Ä-Kd©ð ¤Ä©ï_-¯ä¢Ÿ¿Õ-Â¹× ª½Ö.„çªáu ÊÕ¢* ª½Ö.2 „ä©Õ “X¾„ä¬Á ª½Õ®¾Õ«á’à ÍçLx¢ÍÃL. «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©-Â¹× “X¾Åäu-¹¢’à œ¿¦Õs ƒ„ÃyL. ꪄþ ¤ÄKd©ðx ¤Ä©ï_¯ä §Œá«-ÅŒÕ-©-Â¹× Âí¢Ÿ¿ª½Õ EªÃy-£¾Ç-¹×-©Õ …*ÅŒ “X¾„ä¬Á¢ ¹Lp-²Äh-ª½Õ.
-«Ö-Ÿ¿-¹-“Ÿ¿-„Ãu© „ÃK’Ã..: ꪄþ ¤ÄKd©Õ Ê’¹ª½¢©ð «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© „ÃK’à NœËNœË’à •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ÂíéÂj¯þ NE§çÖT¢Íä „Ãª½¢Åà ŠÂ¹ ¦%¢Ÿ¿¢’Ã, ‡©ü‡®ýœÎ «Õªî ¦%¢Ÿ¿¢, ‡¢œÎ‡¢\ ƒ¢Âî ¦%¢Ÿ¿¢ ƒ©Ç „êâÅÃ-©ðx „䜿Õ¹©Õ Eª½y-£ÏǢ͌Õ-¹ע{Õ-¯Ãoª½Õ. \œÄCÊoª½’à OšË èðª½Õ ¦Ç’à åXJT¢C. ®ÏFª½¢’Ã-EÂË Íç¢CÊ §Œá«Â¹×©Õ, «á¢¦ªá ÊÕ¢* «*aÊ ¦µÇ«Õ©Õ ꪄþ ¤ÄKd©ðx EÅŒu¢ èðª½Õ’à Ê%ÅŒu¢ Í䮾Õh-¯Ão-ª½Õ. ŠÂ¹ „Ãu¤Ä-ª½-„ä-ÅŒh ®¾¢ÅÃÊ¢ ÅŒÊ ®¾Eo-£ÏÇ-ÅŒÕ-©-Â¹× “X¾Åäu-¹¢’Ã ÅŒÊ ƒ©Õx, ¤¶Ä¢£¾Ç÷-®ý-©©ð “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ ÂíCl¯ç©© ¤Ä{Õ „䜿Õ¹©Õ \ªÃp{Õ Íä¬Çª½Õ. ÂíéÂj¯þ NE§çÖ-T¢Íä-„Ã-ª½Õ ꪄþ¤ÄKd Â¢ Âí©¢G§ŒÖ, …’âœÄ ÊÕ¢* ª½£¾Ç-®¾u¢’à B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. ƒÂ¹ ’î„à ÊÕ¢* “ÂË®¾d-©üq, ¹Øu¦üq ª½ÖX¾¢©ð ‡¢œÎ‡¢\ÊÕ ¯çj°-J-§ŒÕ-ÊÕx B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. „Ãu¤Ä-ª½-„ä-ÅŒh ®¾¢ÅÃÊ¢ Eª½y-£ÏÇ-®¾Õh-Êo ¤ÄKd©åXj ®¾«ÖÍê½¢ ªÃ«œ¿¢, ¤òM®¾Õ© EX¶¾Ö ÆCµÂ¹¢ Â뜿¢Åî ’î„Ã, «Õ¢’¹-@ÁÚ-ª½Õ, ŠœË³Ä©Â¹× „ÚËE «ÖªÃaª½Õ.
¹{dœË Í䮾Õh¯Ão ‚¢Ÿî-@Á-Ê-¹-ª½-„äÕ: œÎ®ÔXÔ ®ÔdåX¶¯þ ª½O¢“Ÿ¿
-Ê-’¹ª½¢©ð «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu© NE§çÖ’¹¢, ꪄþ ¤ÄKd©åXj ’¹šËd EX¶¾Ö …¢Íâ. ÂíéÂj¯þ, å£ÇªÃªá¯þ, ͵Œª½®ý C’¹Õ«ÕAåXj Ÿ¿%†ÏdE ꢓD-¹-J¢ÍŒ-œ¿¢Åî ÂíCl ¯ç©©Õ’à OšË NE§çÖ’¹¢ ÅŒT_-¤ò-ªá¢C. ƒšÌ«© ꪄþ ¤ÄKd©Õ è𪽢Ÿ¿Õ-¹×-¯Ãoªá. ¦¢èÇ-ªÃ-£ÏÇ-©üq, WHx£ÏÇ-©üq©ð ÆÊÕ«ÖÊ«áÊo “X¾AÍîšÇ ²òŸÄ©Õ Eª½y-£ÏÇ¢Íâ, ÅŒE&©Õ Íä¬Ç¢. «Ö ÍŒª½u©Åî ÂíCl’à ŌT_¢C. «ÕŸµ¿u-ÅŒ-ª½-’¹A §Œá«B, §Œá«Â¹×©Õ ꪄþ ¤ÄKd©ðx ¤Ä©ï_-Ê-œ¿-„äÕ ‚¢Ÿî@ÁÊ Â¹LT²òh¢C. åXj’à ÂíÅŒhª½Â¹¢ «ÖŸ¿-¹-“Ÿ¿-„Ãu-©Õ ‡¢œÎ‡¢\, ‡©ü‡-®ý-œÎ-©Õ Ê’¹ªÃEÂË C’¹Õ«ÕA Æ«ÛÅŒÕ-¯Ãoªá. ‡¢œÎ‡¢\ÊÕ X¾KÂË~¢* ÍŒÖæ®h-ÅŒ-X¾p X¾{Õd-Âî©ä¢. D¢Åî¤Ä{Õ EªÃy-£¾Ç-¹×-©Õ ÂíÅŒhÂíÅŒh X¾Ÿ¿l´-ÅŒÕ-©ðx ‡¢œÎ‡¢\, ‡©ü‡-®ý-œÎ-©-ÊÕ B®¾Õ-¹×-«®¾Õh-¯Ão-ª½Õ. OšË «ÕÅŒÕh©ð X¾œËÅä œ¿¦Õs Â¢ ¯äªÃ©Õ Íäæ® ²ÄnªáÂË Í䪽Õ-¹עšÇª½Õ. Ê’¹ª½¢©ð NE§çÖ’¹¢, ®¾ª½X¶¾ªÃ ꢓŸÄ©åXj «áÊÕt¢Ÿ¿Õ «ÕJEo ŸÄœ¿Õ©Õ Íä²Äh¢. ²ÄŸµ¿u-„çÕi-ʢŌ ÅŒyª½©ð “œ¿’ûq NE§çÖ’ÃEo ¹{dœË Íä²Äh¢.

Tuesday 19 June 2012

పక్కా ప్రణాళికతోనే దళితులపెై దాడి


June 16, 2012
15-vsp-3 
శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌ : వంగర మండలం, లక్ష్మీపేట గ్రామలో దళితులపెై ప్రణాళికా బద్దంగానే దాడి జరిగిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ అన్నారు. శుక్రవారం స్థానిక రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు భారీ పరిశ్రమ శాఖామంత్రి గీతారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు, ఎంపి జెడి శీలంతో వచ్చారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి రిమ్స్‌ డెైరెక్టర్‌ చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులెైన వారు ఎవరెైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. సమాజంలో ఇంకా కులవివక్ష, వెైషమ్యాలు కలిగి ఉండడం అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. వివాదాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారని, వాస్తవానికి ఈ వివాదం గతం నుండి ఉందన్నారు.

సీబీ సిఐడీ విచారణ జరిపి దోషుల వివరాలు బహిరంగ పరిచేందుకు ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. త్వరలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ కమిటీతో ఈ ఘటనపెై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం నిరూపితమైతే చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీ జేడీ శీలం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరగా నేరవేర్చి బాధితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున దళిత మంత్రులు అందిస్తున్నట్లు మంత్రి గీతారెడ్డి క్షతగాత్రులకు తెలిపారు. ఆదే విధంగా గాయపడినవారికి రూ 25వేలు, స్పల్పంగా గాయపడినవారికి రూ.10 వేలు అందించనున్నట్లు చెప్పారు.

నలుగురు దళితుల నరికివేత


June 13, 2012
12-vsp2శ్రీకాకుళం, మేజర్‌న్యూస్‌: శ్రీకాకుళం జిల్లాలో దళితులపెై దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ దాడిలో నలుగురు దళితులు హతమయ్యారు. అగ్రవర్ణాలు ఏకమై చేసిన ఈ దాడిలో మరో 21 మంది గాయపడ్డారు. భూ వివాదంలో జరిగిన ఈ దాడిపెై కుల సంఘనాయకులు రంగంలోకి దిగారు.మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పంట భూమిని అందివ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా, వంగర మండలం, క్ష్మీపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనపెై అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగారు. మడ్డువలస రిజర్వాయర్‌ పథకంలో ముంపునకు గురెైన క్ష్మీపురం గ్రామానికి చెందిన భూములను ప్రభుత్వం సేకరించింది. ఇందుకు నష్టపరిహారం కూడా ఇచ్చింది.

ఇది జరిగి దాదాపు 10 ఏళ్లు అయింది. గ్రామం కూడా మునిగిపోవడంతో వారికి కావలసిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు స్థలాన్ని కూడా సమకూర్చారు. అయితే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉంచకపోవడంతో సేకరించిన భూమిలో 60 ఎకరాలు ముంపునకు గురవలేదు. ఇది గమనించిన ఆ గ్రామానికి చెందిన కొంతమంది దళితులు సాగుచేసేందుకు సిద్ధమయ్యారు. ఇది తగదని ఆ గ్రామానికి చెందిన అగ్రవర్ణాల రెైతులు ఆటంకపర్చారు. ఈ వివాదం గత నాలుగేళ్లగా జరుగుతోంది. ఈ లోగా ఒకరిపెై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, రాజీ పడడం జరుగుతోంది. అయితే ఇది మరింత ముదరడంతో గమనించిన పోలీసు అధికారులు గ్రామంలో ఎటువంటి తగాదా రాకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అయితే ఉప ఎన్నికల దృష్ట్యా పోలీసులు ఆ గ్రామానికి సోమవారం , మంగళవారం పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయారు. ఇది గమనించిన రెైతులు మూకమ్మడిగా దళితులపెై మారణాయుధాలతో దాడి చేశారు.

ఉన్నఫలంగా దాడి చేయడంతో ఎన్‌. వెంకటి (60), బి సుందరరావు (40), సిహెచ్‌ అప్పడు (35), ఎన్‌ సంగమేసం (40)లు మరణించారు. అదే విధంగా మరో 21 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అగ్రవర్ణాలకు చెందిన 9 మంది రెైతులు కూడా గాయాల పాలయ్యారు. క్షత గాత్రులను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు అక్కడ చికిత్స పొందుతున్నారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అగ్రవర్ణాల దాడిలో మృతి చెందిన నలుగురు కుటుంబాలకు ఒక్కోక్కరికీ రూ. 10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పాల్తేటి పెంటారావు, యువజన నాయకులు మజ్జి గణపతి డిమాండ్‌ చేశారు. ప్రతీ ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రతీ ఇంటికి రెండు ఎకరాల చొపున్న పంట భూములు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ చర్య హేహ్యమైనదిగా వర్ణించారు. తక్షణమే నిందితులను పట్టుకుని కఠినంగా క్షించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

జిల్లాకోక వృత్తి... అయినా విముక్తి లేదు

June 1, 2012
Chattaదేశ ప్రధానిగా ఎదిగి, బహుబాషా కోవిదునిగా గుర్తింపు పొందిన పీవీ నరసింహారావుకు చిన్నతనంలో విద్యాబోధచే సింది చాత్తాద శ్రీవెైష్ణవులే. నిజాం నవాబుల ఆస్థాన వెైద్యలూ వీరే. నర్శింహ శతకం, కృష్ణ శతకం రచించిందీ వీరీ వంశీ యులే. అయితే ఇప్పుడు వీరి పరిస్థితి మాత్రం అందుకు భి న్నంగా ఉంది. రోజు గడవడమే దుర్భరమై జిల్లాకొక వృత్తి చ ేసి పొట్టపోసుకుంటున్నారు. సాతాని అంటే... ధరించనివారు అనే అర్థం ధ్వనిస్తుంది. 11 శాతాబ్దంలో ఇది ప్రాచుర్యం పొందింది. కాగా సాతాని కులస్తులు తర్వాతి కాలంలో చాత్తాద శ్రీ వెైష్ణవగా పేరు మా ర్చుకున్నారు. బ్రాహ్మణాధిక్యతను ధిక్కరించి, జంధ్యాన్ని- శి గను త్యగించి, వెైష్ణవ తత్వాన్ని చాటిచెప్పినవారే చాత్తాద శ్రీ వెైష్ణవులు. చాత్తాద అంటే త్యజించినవాడు అని అర్థం. రామా నుజాచార్యుల శిష్యుపరంపరే చాత్తాద శ్రీ వెైష్ణవులు.

ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక న్యాయంకోసం గళం విప్పిం ది వీరే. తిరుపతిలో పూల తోటలు పెంచి శ్రీ వేంకటేశ్వర స్వా మికి అర్పించారిని చరిత్ర చెపుతోంది. అంతేకాదు... వీరు దే వాలయ ప్రాంగణాలను ఊడ్చి శుభ్రం చేయటం, దేవాల యంలో వాడిపోయిన పూలను తీసివేయ టం... వంటి పను లు కూడా చేస్తుండేవారు. ఇక గ్రామాల్లో సాతాని అయ్య వా ర్లు, సాతాని పంతుళ్లుగా ఇప్పటికీ కొన్ని జిల్లాలలో వీరు పిల వబడుతున్నారు. అప్పట్లో గ్రామ చావిడిలో కూర్చొని పాఠా లు చెప్పేవారు. పాఠశాల నడిపే స్తోమత లేకపోవడంతో చెట్టు కింద పాఠశాలలను నడి పారు. ఈ క్రమంలో రెైతులు ఏడా దికి ఒకసారి ఇచ్చే ధా న్యంతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిం చారు. అంతేకాకుండా తమకు తెలిసినమూలికా వెైద్యం ద్వా రా ఆయా గ్రామీణ ప్ర జలకు వెైద్య సేవలందించారు. ఇప్పటి కీ కొన్ని వెైష్ణవ దేవాల యాల్లో అర్చకులుగా కూడా వ్యవహరి స్తున్నారు. అయితే థూప దీప నెైవేద్యాల పేరుతో 2, 500 రూపాయలు మాత్ర మే వీరికి అందుతున్నాయి.

అది కూడా గ్రామ పంచాయితీల దయాదాక్షిణ్యాలపెైన ఆధారపడా ల్సి వ స్తోంది. వీరికి కనీసం మూడు వేల రూపాయలు చెల్లిం చాల ని సుప్రీం కోర్టు ఆదేశించినా అమలు చేసినవారు లేరు! నెల కు వస్తున్న రూ.2, 500లపెై కుటుంబం మొత్తం ఆధార పడి జీవిస్తోంది. కనుకనే వీరి జీవితాలు దుర్భరంగా పూరిగు డిసె లకే పరిమితమ య్యాయి. ఇదిలా ఉంటే వారసత్వంగా భూ మి వస్తుందన్న మాటేకానీ, దానికి పట్టాలేకపోవడంతో ఆ యా గ్రామ పెత్తం దారులపెై ఆధారపడాల్సి వస్తోంది. మరికొ న్ని గ్రామాలలో తరతరాలుగా వస్తున్న భూములు అన్యాక్రాం తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి రాయలసీమ జిలా ్లల లో ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపెై వీరు ఐక్య పోరాటాలు చ ేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో అర్చన కోసం న్యాయపో రాటాలు చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. గతంలో వీరికి 7 4 మఠాలు ఉండేవి. అయితే ఇప్పుడు వారి పౌరొహిత్యం కింద ఉన్నవాటిని వేళ్ల మీదలెక్కించవచ్చు.

తూర్పుగోదావరి జిల్లాలో తాలూరు మఠాన్ని అగ్రవర్ణాలవారు లాక్కునే ప్రయ త్నాలు చేస్తే అక్కడ నిరంతర పోరాటం చేస్తు న్నారు. అక్కడ వీరే పూజారులు కావడంతో ఈ పరిస్థితి దాపు రించింది. ఇక కదిరి నర్శింహస్వామి దేవాలయంలో ఎంతో కాలంగా వీరు పూజలు చేస్తుండగా వీరిని వెైకానసులు తరి మికొట్టారు!. ఈ విధంగా వీరికి బలం ఉన్న చోట న్యాయపో రాటాలకు దిగుతూ... బలం లేని చోట వాటిని వదులుకుం టున్నారు. సంఖ్యాపరంగా వీరి జనాభా తక్కువ కావడంతో భవిష్యత్‌లో తమ చేతిలో ఎన్ని దేవాలయాలు ఉంటా యో కూడా చెప్పలేమంటున్నారు. ‘స్వామి’ అని పదాన్ని వీరు తమ పేరుకు చివర్న చేర్చుకో వడంతో అప్పట్లో వీరు ఎక్కడున్నా సులభంగా గుర్తించే వా రు. అయితే ఈ స్వామి కులం పేరు కాకపోవడంతో మిగతా కులాలవారు కూడా ఆ స్వామి పదాన్ని పేరుకు చివర్న తగి లించుకోవడంతో స్వామి అనే పదానికి వీరిలో కూడా ప్రాధ న్యత తగ్గిపోయింది. ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి చివ రకు వీరు జిల్లా కొక వృత్తిలో కొనసాగుతున్నారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలలో అర్చకులుగా ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారు. కాగా ఇక్కడ వీరు జంథ్యం వేసుకోవ డం సర్వసాధారణం. ఉభయ గోదావరి జిల్లాలలోని వారు అర్చక త్వంతోపాటు శ్రాద్థ ఖర్మలు కూడా ని ర్వర్తిస్తారు. నిజా మాబాద్‌, వరంగల్‌ జిల్లాలలో అద్దకాలు అద్ది జీవిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అడవిలోని అడ్డాకులు సేకరిం చి వాటిని విస ్తళ్లు కుట్టి మార్కెట్‌ చేసి జీవనం సాగిస్తున్నారు. మరికొన్ని జి ల్లాలలో హరిదాసులుగా కూడా బిక్షాటన చేస్తు న్నారు. ఈ వి దంగా ఏ జిల్లాలో ఏ వృత్తి ఎంచుకున్నా వీరిలో ఎక్కువమంది బతుకు పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఎంబీసీలుగాగుర్తించాలి;
Chattada-చాత్తాద శ్రీ వెైష్ణవులను తమిళనాడులో ఎంబీసీలుగా గుర్తించారనీ అదే విధంగా రాష్ర్ట ప్రభుత్వం కూడా తమను ఎంబీసీలుగు గుర్తించాలని ఎంబీసీ సంక్షేమ సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు టి రామానుజం కొరుతున్నారు. తమ పూర్వీకులు దేవాలయాలలో చేస్తున్న అర్చక వృత్తిని ఆధిపత్య పోరాటంలో కోల్పోయిన వారు దయనీయ స్థితిలో రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలలోని వారిని అర్చకులుగా తిరిగి నియమిం చడానికి ప్రభుత్వం కృషి చేయాలంటారు. ఇక మూలికా వెైద్యంలో ఎనలేని ప్రామీణ్యం కనబరుస్తున్న తమ సామాజిక వర్గంవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఔషథ మొక్కల పెంపకానికి స్థలం కేటాయించా లంటారు.

అంతేకా కుండా ఆర్థిక స్తోమతలేని చాత్తాద శ్రీ వెైష్ణవులు గ్రామీణ ప్రాంతాలలో ట్యూషన్లు చెప్పి ఇప్పటికీ జీవనం సాగిస్తు న్నారనీ, అటువంటివారికి జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ప్రోత్సాహాన్ని కల్పించాలని కోరు తున్నారు. తరతరాలుగా దేవా లయాలతోనే తమ జీవితాలు ముడి పడి ఉన్నాయి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులతో చాత్తాద శ్రీ వెైష్ణవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.

hjkl

కూడు పెట్టని కులవృత్తి


June 2, 2012
022 
ఐక్యత... కట్టబాట్లకు ప్రతీకలుగా నిలుస్తారు వీరభ ద్రీయులు. భక్తిపారవశ్యంతో వీరు తమ శరీరాన్ని తూట్లు పొడుచుకుంటారు... కణకణలాడే అగ్గిగుండాలను అవలీలగా దాటేస్తారు. వీరికి వీరుముష్టి, నెత్తికోతల, విభూతులవారు... వంటి పేర్లు కూడా ఉన్నాయి. అయితే రాష్ర్ట వ్యాప్తంగా వీరు వీరభద్రీ యులగా పిలిపించుకోవాలనే తపనతో పాతపేర్లకు తిలోదకాలు పలికారు.వీరి కులం పేరులో కనిపించే ‘ముష్టి’ అనే పదం వీరి శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. అప్పట్లో వీరి పిడికిలి దెబ్బతో కొబ్బ రికాయ నుజ్జు నుజ్జు అయ్యేది. అంతేకాదు... అప్పట్లో వీరు బలశాలులు కావడంతో ప్రెైవేట్‌ ఆర్మీగా ఏర్పాడి నాటి వెైశ్యుల ధన, ప్రాణాలను రక్షించారు. కనుకనే ఇప్పటితరం వెైశ్యుల ద గ్గర భిక్షాటన చేస్తుంటారు. వెైశ్యుల దగ్గర తప్ప మరెక్కడా చే యిచాపరు. అయితే ఈ ప్రక్రియను వీరు అడుక్కోవడంగా భా వించరు! వెైశ్యులు తమకు ఇచ్చేది బిక్ష కాదంటారు.

దాన్ని కేవ లం తాము అప్పట్లో వారి ధన ప్రాణాలు కాపాడినందుకు కృత జ్ఞతగా వెైశ్యులిచ్చే పారితోషకమని చెపుతారు. అప్పటి తరం తమ కండబలంతో వెైశ్యుల ఆస్తులు కాపాడారు కనుకనే ఇ ప్పుడు వారు ఉన్నత స్థితిలో ఉన్నారని చెపుతారు. ఈ నేపథ్యం లో పెై స్థాయిలో ఉన్న వెైశ్యులు వీరభద్రియులను ఆదుకో వాల్సిన కనీస బాధ్యత ఉందంటారు. అంతేకాదు... వెైశ్యులకు సంబంధిచిన శుభకార్యాలలో వీర పాల్గొని భద్రీయుని విగ్ర హానికి స్నానం చేయించడం, దండకాలు చదవడం ఇప్పటికే చేస్తూనే ఉన్నారు. వీరి పూజా విధానం కూడా పద్యాల రూపం లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కేవలం కులం పేరుచూపి తమను హీనంగా చూడవద్దని కోరుతున్నారు. వీరభద్రియు లుగా సమాజంలో సముచిత స్థానం కల్పించమంటున్నారు.

వీరభద్రులు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాల్లో వీరభద్రస్వామి ఉత్సవాలు చేస్తారు. ముఖానికి వీభూతి దట్టిం చి, రుద్రాక్ష మాలలు, వెండి లింగం కాయను మెడలో వేసు కుని, నడుము చుట్టూ గంటలు, శంఖం, చేతకత్తి చేతబట్టి, జేగంటతో జాతరలలో ఎవరెైన దర్శనమిస్తుంటారు. నారస ములు గుచ్చుకుని నాట్యం చేస్తారు. పాటలు పాడుతూ, చేతిలోని కత్తిని లయబద్దంగా తిప్పుతూ వీరంగం వేస్తారు. దండకాలు, వీరంగాలు, శరభలు... తదితర పద్య గేయ సాహిత్యం ఈ సాంప్రదాయంతో ముడిపడింది. ఈ సందర్భం గా నగారా, కంచు జాగట మోగిస్తారు. నాలుకకు శూలాలు గుచ్చుకోవడం, మెడకు దబ్బనం గుచ్చుకోవడం సర్వసాధార ణం. అంతేకాదు శరీరభాగాలపెై దబ్బనాలు గుచ్చుకుని తమ భక్తిని చాటుకుంటారు. భారీ ప్రబలు కట్టడంతో వీరికి వీరే సాటి. భక్తి పారవశ్యంలో అగ్నిగుండాలను తొక్కుతారు.

ఇక వీరు పచ్చబొట్టు వేయడంలో కూడా నిష్ణాతులు. కీళ్ల నొప్పులకు, మోకాళ్ల పొప్పులకు, ఛాతీ నొప్పులున్నవారు వీరి వద్దకు గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చి పచ్చబొట్లు పొడిపించు కుంటారు. ఇప్పటికీ గ్రామాలలో ఈ ప్రక్రయ కొనసాగుతూనే ఉంది. ప్రజలలో వస్తున్న మార్పు కారుణంగా వీరి కులవృ త్తికి ఆదరణ తగ్గింది. వీరు వీభూతులు తయారు చేస్తారు కనుక వీరిని వీభూతులవారు అని కూడా పిలుస్తారు. ఈ నేప థ్యంలో ఊరూరూ తిరగటం, దేశ దిమ్మరులుగా మారటం వీరివంతెైంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు సంచారం చేస్తూ జీవనం గడుపుతారు. ఎక్కువ భాగం ఊరి చివర చింతచెట్ల కిందే వీరు మకాం చేస్తుంటారు. వీరి వద్ద సామాను ఎక్కువ ఉన్న సందర్భాలలో మాత్రం పీర్ల చావిళ్లను ఆశ్రయిస్తారు. వీరికి కూడా మిరాశీ గ్రామాలు ఉన్నాయి. ఆ కట్టుబాట్లను ఎప్పుడూ దాటే ప్రయత్నం చేయరు. ఇక చాపలు అల్లి, అల్యూ మినియం పాత్రలు మార్కెట్‌ చేసి కూడా జీవనం సాగిస్తారు.

ఈ విధంగా ఇప్పటి తరంలోని వీరభద్రీయులు ఎక్కువమంది కష్టించి పనిచేయటమో, చిరువ్యాపారం చేసి గౌరవంగా బత కటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం కులం పేరుతో తమను చిన్నచూపు చూ డటంతో మానసి కంగా కుంగిపోతు న్నారు. ప్రస్తుతం వీరు అల్యూమినియం పాత్రలు వ్యాపా రమే వృత్తిగా ఎంచుకున్నారు. పెట్టబడి పెట్టే స్తోమత లేకపోవ టంతో ఎక్కువమంది అప్పుతెచ్చుకుంటారు. అధికవడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో ఊరూరా తిరిగి సంపా దించిన సొమ్ములో దాదాపు సగం సంపాదన వడ్డీలకే చెల్లిస్తారు. ఇటువంటి దయనీయ పరిస్థితిని అధిగమిం చేందుకు తమ పిల్లలకు విద్య చెప్పించే ప్రయత్నం చేస్తున్నా రు. దాదాపు రెండు దశాబ్దాల క్రిందటే కులం పేరును ‘వీర భద్రీయులు’గా మార్పు చేయించు కున్నారు. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో కుల ధృవీకరణ పత్రాలలో వీరి పేరును వీరముష్టిగానే అధికారులు మంజూరు చేస్తున్నారు. దీనిపెై వీరు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్దమవుతున్నారు.

శీతకన్ను
Kssప్రభుత్వ చల్లని చూపు తమపెై లేదంటారు ఆంధ్రప్రదేశ్‌ వీరభద్రియ (వీరముష్టి) సంఘం అధ్యక్షులు కె. రాజేశ్వరరావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ తమకోసం ప్రభుత్వం కేటాయించిన ఫలాలు తమకు అందలేదని చెపుతున్నారు. స్వయం కృషితో వీరభద్రీయులు చిరువ్యాపారాలు ప్రారంభించి రోజులు గడుపుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తే మరి కొన్ని కుటుంబాలు దారిద్య్రరేఖను దాటుకుని ముందుకువస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఫెైనాన్స్‌ కార్పొరేషన్‌ విషయంలో కూడా ప్రభుత్వం తమకు ఆశలు రేపిందే తప్ప... ఆచరణలో చూపలేదంటారు. కుల వృత్తి కోల్పోయి చిరువ్యాపారాలకే పరిమితమైన తమను ఆదుకోవాలని కోరుతు న్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ప్రభుత్వం ఇతోధికంగా సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. మరి ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాల ద్వారా ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
awq

వెలవెబోతున్న నీల’ వెలుగులు


June 3, 2012
సమాజంలో గౌరవంగా బతికేందుకు నీలకులస్థులు చేయని ప్రయత్నం లేదు. అధునాతన పరికరాలు వీరి వృత్తిలోకి ప్రవేశించడంతో కులవృత్తినే పట్టుకుని వేలాడకుండా మరో వృత్తిని ఎంచుకున్నారు. అక్కడా ఎదురుదెబ్బతినడంతో ఇంకో వృత్తిని ఎంచుకున్నారు. ఈ విధంగా బతుకుతెెరువు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. శ్రమిస్తూనే ఉన్నారు

Cotto
నూలు వస్త్రాలకు అద్దకాలు అద్దేందుకు ఉపయోగించే నీలి రంగు తయారీలో వీరు నిష్ణాతులు. శుద్థి చేసిన నూలుకు హా ని కలుగకుండా, రంగు వెలిసిపోకుండా వీరు రంగులను త యారు చేయడంతో అప్పట్లో చేనేత కార్మికులు వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కనుకనే వీరు తయారు చేసే నీలి రంగు కు చేనేతకార్మికులలో మంచి గిరాకీ ఉండేది.

నీలికులస్తులు రె క్కలు ముక్కలు చేసుకుని ఈ రంగు తయారు చేసేవారు. దీని కోసం రోజుల తరబడి చెమటోడ్చేవారు. వీరు నీలి రంగును త యారు చేసే ప్రక్రియ కూడా చాలా విచిత్రంగా ఉండేది. తగరే సల అనే చెట్టు గింజలను ఉడకబెట్టి వాటి నుండి చిక్కడి ద్రవా న్ని తీనేవారు. ఈ ద్రవం నీల రంగులో ఉంటుంది. ఈ ద్రవాని కి బెంగాల్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఇండిగోను కలిపి మీట రు ఎత్తున్న కాగుల్లో మగ్గబెట్టేవారు. ఈ ప్రక్రియ మరీ విచిత్రం గా ఉంటుంది. మేక, గొర్రె పెంటికలను సేకరించి వాటి మధ్య ఈ కాగులను నిలబెట్టేవారు. టైం గడిచేకొద్దీ ఈ పెంటికలలో రసాయన క్రియ జరిగేది. దీంతో వెచ్చటి ఆవిర్లు వెదజల్లేవి. ఈ విధంగా రెండు రోజులపాటు కాగుల్లో ఉన్న ద్రవం క్రమంగా మగ్గుతుంది. ఫలితంగా నల్లటి రసం తయారయ్యేది.

అయితే వీరు తయారు చేసిన ఈ రంగులు పర్మనెంట్‌గా ఉండాలంటే మరికొంత శ్రమపడాల్సి వచ్చేది. ఈ క్రమంలో సున్నపు రాయిని తీసుకొచ్చి బట్టీ పెట్టి సున్నం తయారు చేసే వారు. చౌడు భూముల నుంచి సేకరించిన మట్టీకి ఈ సున్నాన్ని కలిపి మిశ్రమాన్ని పెద్ద కుండలో వేసి బాగా ప్రెస్‌ చేస్తారు. దాని పైన నీళ్లు పోస్తే ఒక్కొక్క బొట్టు ఆ కుండ ద్వారా ఫిల్టర్‌ అవు తుంది. ఈ విధంగా వచ్చే ద్రవం చాలా గాఢంగా ఉంటుంది. ఆ ద్రవాన్ని అంతా సేకరించి నీలి, నలుపు రంగుల్లో కలిపి కడ వలలో నిల్వ చేసేవారు. ఈ నిల్వచేసిన రంగులను నూలుకు ప ట్టించేవారు. వాడకంలో బట్టలు చీలికలు-పేలికలుగా మారి నా... వీరు వేసిని రంగు మాత్రం వెలిసేదికాదు. నీలి, నలుపు రంగులు కాకుండా, ఇతర రంగులు కావాలంటే ఆయా పాళ్ల వంతున కెమికెల్స్‌ వేసి తయారు చేసుకునేవారు. అప్పట్లో చే నేత కార్మికులు వీళ్ల దగ్గరకు నూలు తెచ్చి రంగులు అద్దకం చే యించుకునేవారు.

అయితే ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రంగులు, రసాయనాల కారణంగా వీరి వృత్తిపై వేటు పడింది. అంటే ఆ రంగుల ఖరీ దు తక్కువ కావడంతో ఆ పోటీకి వీరు తట్టుకోలేకపోయారు. వీరు క్రమంగా వృత్తికి దూరమయ్యారు. వీరి కులవృత్తి దె బ్బతినటంతో దీనికి అనుబంధంగా ఉన్న చేనేతవైపు వీరు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో వీరు కూడా నూలు వడికి దారం తీసి పడుగుకట్టి మగ్గాలపై బట్టలు నేసే ప్రయత్నం చేశారు. క నుకనే ఇప్పటికీ చేనేత రంగంలో ఈ నీలికులస్తులు చాలా మంది జీవనం గడుపుతున్నారు. మీటర్లు బట్ట నేస్తే వచ్చే ఆదా యం చాల తక్కువ. అయినప్పటికీ వీరు ఉదయం పది గుంట ల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఇంతగా శ్రమించినా కనీసం పది మీటర్ల బట్ట నేయటం గగ నం.

బాగా అనుభవం ఉన్న వారు మాత్రం మరో రెండు మీట ర్లు నేయగలరు. అంటే ఎంత నైపుణ్యం ప్రదర్శించినా రోజు మొత్తం మీద 100 రూపాయలకు మించి సంపాదించలేరు. అయితే గతంలో పోల్చుకుంటే వీరి పరిస్థితి కొంత మెరుగ య్యిందనుకుంటున్న సమయంలో చేనేత రంగంలోకి కూడా ఆధునిక యంత్రాలు రంగప్రవేశం చేశాయి. దీంతో చేనే తరంగానికి కూడా ఊహించని దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ వీ ళ్లకు కషాలు మొదలయ్యాయి.

సున్నితమైన పనికి అలవాటు పడిన వీరు కాయకష్టం చేయ లేక ఇంటిపట్టున ఉండి బీడీలు చుట్టే పనిని ఎంచుకున్నారు. కాగా ఇక్కడా వీరు దోపిడీకి గురవుతున్నారు. బీడీ పరిశ్ర మలో యాజమాన్యం వెయ్యి బీడీలకు సరిపోను తునికాకు సప్ల య్‌ చేయదు. తరుగుబడిన ఆకును వీరే కొనుగోలు చేసి వేయి బీడీలకు లెక్క చూపాలి. దెబ్బతిన్న ఆకు ఇచ్చి మంచి బీడీలుత యారుచేసి ఇవ్వాలని యాజమాన్యం డిమాండ్‌ చేస్తుంది. ఈ క్రమంలో తరుగు భర్తీ చేయడానికి వీరి శ్రమలో కొంత భాగం కోల్పోతున్నారు. అయితే పూట గడవడానికి కావలసిన డబ్బు చేతికి అందటంతో ఈ వృత్తిని వదులుకోలేకపోతున్నారు.

క్రమంగా బతుకుదెరువు కోసం బీడీలు చుట్టడానికి సిద్దమ య్యారు. మొదటి నుండీ కుటీర పరిశ్రమకు అలవాటు పడ్డవారు కావడంతో బీడీలు చుట్టడం వాటిని సంబంధిత య జమానికి చేరవేయడంతో బతుకు సాఫీగానే సాగింది. అయితే ఈ పరిశ్రమ కూడా సంక్షోభంలో చిక్కుకోవటంతో నేడు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కాలగమనంలో అనేక అడ్డంకులు ఎదురైనా శతాబ్దాల క్రిందటి వీరు వేసిన నీలి రంగు మాత్రం వీరిని వదల్లేదు. అంటే ఇప్పటికీ నీలి కులస్తులు గానే సమాజంలో పిలువబడుతున్నారు.

మన రాష్ర్టంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే నీలి కులస్తులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయారు. కర్నాటక రాష్ర్టంలో గుల్‌బర్గా, చిందోళి, ముధోల్‌, బీదర్‌ ప్రాంతాలలో వీరు విస్తరించారు. అక్కడ వీరు నీల్‌గా ర్‌గా పిలువబడుతూ బిసి రిజర్వేషన్‌ సౌకర్యాలు పొందుతు న్నారు. మహారాష్ర్టలో నీలినిరాళిగా గుర్తింపు పొందారు. ఈ రాష్ర్టంలో వీరికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించక పోవటంతో మరింత వెనుకబడ్డారు. మన రాష్ర్టంలో వీరిని నీలి కులస్తులు గా పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా వీరంతా ఇక్కడి నుండి వలసవెళ్లినవారే.

గ్రూపు మార్చినా మార్పులేదే!
kumar‘నీలి’ కులాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితాలోని డి గ్రూప్‌ నుండి బి గ్రూ ప్‌కు మార్చినా ఫలితం లేదని పెదవి విరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ నీలి కుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఎన్‌ అశోక్‌ కుమార్‌. బీసీ కులాలలో ఇప్పటికీ తాము అత్యంత వెనుకబడిన తరగ తుల్లో ఉన్నామని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో తమవా రికి కనీసం ఉండటానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గతం నుండి తమ సామా జికవర్గం బీసీ రిజర్వేషన్‌ జాబితాలో ఉన్నా, ప్రభుత్వం చేసిన చిన్న పొరపాటు కారణంగా గత నాలుగు దశాబ్దాలు గా నీలి కులస్తులకు అందుతున్న రిజర్వేషన్‌ సౌకర్యాన్ని పూ ర్తిగా వినియోగించుకోలేక పోయామంటారు.

నీలి కులస్తు లను 1968లో బిసి-డి జాబితాలో ప్రకటిస్తూ ‘నెల్లి’ అని పే ర్కొనటంతో నీలి కులస్తులమైన తమకు అధికారులు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తమ జీవనశైలి మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలంటారు. నీలి కులస్తులలో ఎక్కువమంది చేనేత కా ర్మికులుగానే జీవనం సాగిస్తున్నారు కనుక తమకూ ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని కోరుతున్నారు.

Untita

‘నార’ పోయింది ‘నారు’ మిగిలింది


June 4, 2012
పెఱిక... ఇది కులం పేరు అయినప్పటికీ, ఇదొక వస్తువు! ఇది ఎలా ఉంటుందో... చూద్దామన్నా ప్రస్తుత కాలంలో కనిపించదు!! మ్యూజియంలో కాదుకదా... బొమ్మల్లో కూడా మనకు దర్శనమివ్వదు !!! జనపనారతో తయారు చేసే పెఱిక కొన్ని దశాబ్దాల కిందటే కనుమరు గయ్యింది. అయితే పెఱికను తయారు చేసేవారు సమాజంలో ఇప్పటికీ పెఱిక కులస్థులుగా గుర్తింపుపొందు తున్నారు. ఈ వృత్తి దెబ్బతినడంతో అనుబంధ వృత్తి గోనె సంచుల తయారీని ఎంచుకు న్నారు. అదీ దెబ్బతింది. దీంతో ఎక్కువ మంది వ్యవసాయం వెైపు మళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నార’ పోయిందీ... ‘నారు’ మిగిలింది!

prika0రాష్ర్టంలో వీరు పెఱిక, పెఱిక బలిజ, పురగిరి క్షత్రియగా గుర్తింపు పొందారు. కర్నూలు జిల్లాలో వీరికి అక్కడి వారు ‘రెడ్డి’ అని గౌరవంగా పిలుస్తారు. వీరు నిజా మాబాద్‌, నల్గొండ, వరంగల్‌, ఆదిలాబాద్‌, జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మి గతా జిల్లాలలో అక్కడక్కడా కనిపిస్తారు. విజయనగం, శ్రీకాకుళం జిల్లాలలో కూ డా వీరు ఉన్నారు. అయితే తెలంగాణ జిల్లాలలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు.పెఱిక గురించి ఇప్పటి తరానికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే... ధాన్యం తరలిం చడానికి గాడిదపెై వేసిన గోనె సంచి అని చెప్పొచ్చు. ఈ సంచులను వీరే ప్రత్యేకం గా తయారు చేస్తారు. ఈ సంచిని గాడిద వీపుపెై వేస్తే రెండు వెైపుల నుండి ధాన్యం పోసుకునే అవకాశం ఉంటుంది. దున్నపోతులు, గాడిదలు, గుర్రాలు...

తదితర జంతువుల వీపులపెై పూర్వ కాలం పెఱికల్లో ధాన్యం, అపరాలు నింపి ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అప్పట్లో ఎడ్లబండ్లపెై వేసుకుని తీసుకుపొయే అంత సరు కులేని వారు వీటిని ఎక్కువగా ఉపయోగించేవారు. వీరి సేవలు మన పూర్వీకులందరూ దాదాపుగా ఉపయోగించుకున్నారనేనని చెప్పొచ్చు. కనుక గ్రామాలలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వీరు సంచార జీవులు. పెఱికలు ఎక్కడ అవసవమైతే అక్కడ పెద్ద సంఖ్యలో వీరు వెళ్లి తయారు చేసివస్తారు. అయితే ఎంత దూరం ప్రయాణించినా స్వగ్రామాన్ని మాత్రం మర్చి పోయేవారు కాదు. తాము తయారు చేసివ పెఱికలను మార్కెట్‌ చేయడానికి దగ్గర్లో ఉన్న గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసి తిరిగి స్వగ్రామం చేరుకునేవారు. పెఱిక తయారు చేసే సందర్భంగా జనపనార నుంచి వచ్చే నుసి వలన శ్వాశకోశ వ్యాధుల బారిన పడేవారు.

ఈ సందర్భంలో వీరే స్వయంగా ఆయుర్వేద ఔషథాలను తయా రు చేసుకునేవారు. పెఱికలు తయారు చేయడానికి అప్పట్లో జనుము, గోగులను పెంచి వాటి నుండి నారను వీరే స్వయంగా తీసేవారు. ఈ నార తీసే విధానాన్ని గమ నిస్తే వాళ్లు ఎంతగా శ్రమిస్తారో అర్థమవుతుంది. నార తీయటానికి వీరు ప్రత్యేకం గా ఎంచుకున్న మొ క్కలను ఆరు అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెంచుతారు. అవి బాగా ముదిరాక... వాటిని కోసి చిన్న చిన్న కట్టలుగా కట్టి నీళ్లలో నానాబెడతారు. దాదాపు వారం పది రోజులపాటు నానబెట్టిన ఈ చెట్టనుంచి నారను వేరుచేసి శు భ్రం చేసి ఎండబెట్టేవారు. అటువంటి నా రతో వీరు ఈ పెఱికలు తయారు చేసేవా రు. వీటిని మగ్గాలపెైన కూడా నేసేవారు.

వీ టితోపాటు పెద్ద పెద్ద బోరీలు కూడా తయారు చేసేవారు. అంతేకాదు... తాళ్లు కూడా పేనేవారు. ఇవి మరింత మన్నికగా, దృఢంగా ఉండేందుకు చిం తపిక్కల పొడిని ఉపయోగించేవారు. అంటే... చిం తపిక్కలను పొడిచేసి ఉడికించి చిక్కటి ద్రవాన్ని తయారు చేసేవారు. ఈ ద్రవంలో వారు తయారు చేసిన తాళ్లను ముంచేవారు. దీంతో సన్నటి తాళ్లు కూడా పటిష్టం గా తయారయ్యేవి. ఈ తాళ్లతో 20 మీటర్ల విస్తీర్ణం ఉండే వలల వంటివాటిని కూ డా తయారు చేసేవారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల వారి అవసరాలకు అను గుణంగా వీరు నార వస్తువులను తయారు చేసేవారు. కనుక వీరి రాక కోసం అ ప్పటి గ్రామీణులు ఎదురు చూసేవారు.

యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరగటం, మ హారాష్ర్ట, బెంగాల్‌ నుంచి గోనె సంచులు పెద్ద ఎత్తున దిగుమతి కావటం, గ్రామీణ ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం పెరగడంతో క్రమంగా వీరి వృత్తి దెబ్బతింది. అయితే వృత్తిపెై మమకారం చంపుకోలేనివారు ఇప్పటికీ గోనె సంచులు తయా రు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిని మనం నేటికీ నిజామాబాద్‌ ప్రాంతంలో చూడ వచ్చు. కాగా ఆదిలాబాద్‌, ఖమ్మం వంటి జిల్లాలల్లోని పెఱిక సామాజికవర్గం వారు మరింత వెనుకబడ్డారు. కనుకనే రిజర్వేషన్‌ అంశంలో ఈ ప్రాంతాలలోని వారు త మని బిసి-బి నుంచి బిసి-ఏ గ్రూప్‌కు మార్చమని ఎంతోకాలంగా కోరుతున్నారు.

అయితే పెఱిక వ్యవసాయ అనుబంధ వృత్తి కావడంతో వీరికి కావలసిన ముడిసరుకు, అవసరమైన వాటిని వీరే పండించు కునేవారు. ఈ నేపథ్యంలో వీరికి భూముతో అవరాలు పెరిగా యి. కనుక అనివార్యంగా వీరు భూమి కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో వీరికి భూమిపెై ఎంతోకొంత ఆధిపత్యం వ చ్చింది. భూమిపెై ఆధిపత్యం సంపాదించారు కనుకనే అది వీ రికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. వీరి కుల వృత్తి దెబ్బతిన్నా సొం త భూమి ఉన్న కారణంగా మరొక వృత్తి చేసుకోగలిగారు. ఈ విధంగా వీరు సమాజంలో అన్ని రంగాలలో మనకు కనిపి స్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల దగ్గర నుంచి చిరు వ్యాపారి వరకు వీరు అన్నింటా మనకు కనిపిస్తారు.

ఒక్కమాటలో చెప్పాలంటే వీరు ప్రవేశించని రంగం లేదు. అయితే ఇప్ప టికీ వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉంటున్నారు. కనుకనే వీరి రాజకీయ ప్రతినిధులు శాసన సభలో మనకు దర్శనమిస్తూనే ఉంటారు. అంతేకాదు... వీరు ఎక్కడ ఉన్నా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఎక్కువమంది ఉద్యోగులుగా స్థిరప డ్డారు. ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు కూడా ఈ సామాజిక వర్గం నుంచి వచ్చిన వారున్నా రు. ఇంకా చెప్పాలంటే... ఉన్నత స్థాయికి ఎదిగిన వారు తమ సమాజిక వర్గాన్ని మర్చిపోకుండా మిగిలిన వారి ఎదుగుదలకు తపిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాజభా ని హైదరాబాద్‌లోని ఖెైరతాబాద్‌ నడిబొడ్డున మనకు పెఱిక భవన్‌ దర్శనమిస్తుంది. ఈ భవనంలో వీరు తమ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు వసతి కల్పించి విద్యావంతులును చేస్తున్నారు.

స్థలం కేటాయిస్తే....
ahladరాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో పెఱిక సమాజిక వర్గానికి చెందిన వారికి కనీసం ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే కమ్యూని టీ పరంగా ఉపయోగం ఉంటుందని ఆం ధ్రప్రదేశ్‌ పెఱిక సంఘం అధ్యక్షుడు ఎన్‌ ప్రహల్లాద్‌ ప్రభు త్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకు న్నా ఖెైరతాబాద్‌లో తమ సమాజిక వర్గంవారి సహకారంతో పెఱిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించుకున్నామని చెప్పా రు. తమ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్ధులు ఇక్కడ దాదాపు వందమంది ఉచిత సౌకర్యం పొందుతున్నా రన్నారు. ప్రభుత్వం సహకరిస్తే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పారు.

నామినేటెడ్‌ పోస్టులలో తమ పెఱిక సంఘానికి చెందిన వారికి అవకాశాలు కల్పించాలని కోరారు. దశాబ్దాల కిందటే కుల వృత్తి కోల్పోయారు కనుక స్వయం కృషితో ఎదిగిస్తున్న వారికి వ్యవసాయం వృత్తిలో సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పెఱిక కులానికి చెందివారిలో దాదాపు 99 శాతం వ్యవసాయంపెైనే ఆధారపడి ఉన్నారని చెప్పారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిలాలలో తమకు గుర్తింపు ఉందనీ, ఆయా జిల్లాలలో రాజకీయ చెైతన్యం పొందిన పెఱిక సంఘం నాయకులకు నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
aasw