Tuesday 19 June 2012

పట్ర..ప్రాంతానీకొక వృత్తి


IMG_1994 
మన రాష్ర్టంలోని ‘పట్ర’ అనే సామాజికవర్గం కాలానుగుణంగా కుల వృత్తిని మార్చుకుంటు మనుగడ సాగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమం లో వీరు ఏ ప్రాంతంలో ఉంటే తమకు అనుకూలగా ఉన్న వృత్తులను ఎం చుకున్నారు. పట్ర కులస్తులు నివాసాలుగా ఎంచు కున్న ప్రాంతాలు సై తం విలక్షణంగా ఉంటాయి. గుంటూరు జిల్లాల మొదలు చిత్తూరు జిల్లా వరకు కొండలు, అడవులే వీరి ఆవాసాలు. గిరిపుత్రులుగా జీవనం సాగి స్తున్న వీరు ఎంతోకాలంగా ఎటువంటి రిజర్వేషన్‌ సౌకర్యం లేకుండా మ నుగడ సాగించారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2008లో బిసి రిజ ర్వేషన్‌ సౌకర్యం పొందారు. కాగా ఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరం గానే జీవిస్తున్నారు.1901లో మద్రాసు రాష్ర్ట జనగణనలో ఈ కులాన్ని గురించి వివరణ ఉంది. తెలుగు మాట్లాడే ‘పట్ర’ కులస్తులను వేటగాళ్లు, వ్యవసాయదా రులని పేర్కొంది.

అప్పట్లో అనంతపురం జిల్లా ఏర్పడలేదు. కనుక ప్రధా నంగా కడప, కర్నూలు జిల్లాలలో నివసించేవారిగా చూపింది. పట్ర కుల స్తులు ఒరిస్సా నుంచి వలస వచ్చినవారు కావడంతో నేటికీ వారి మాతృ భాషను మర్చిపోలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఒరియా భాష మాట్లాడే పట్ర కులస్తులను ఇప్పటికీ చూడొచ్చు. అక్కడ వేల సంఖ్యలో జీవిస్తున్న వీరు ‘ఒరియా మాట్లాడే వట్ర వీవర్స్‌ అసోసియేషన్‌’ అనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కర్నాటక రాష్ర్టంలో చిత్తూరు సరిహద్దు నుంచి బెంగుళూరు వరకు, కొంతమేర తమిళనాడు లో కూడా వీరిని చూడొచ్చు.
చిత్తూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు విస్తరించిన నల్లమల్ల అడ వులను, గుట్టలను ఆధారం చేసుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. తొలి రోజుల్లో కొండకోనల్లో వేటగాళ్లగా జీవనం సాగిస్తున్న వీరిలో కొందరు మైదాన ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ విధంగా శ్రీకాకుళం జిల్లాలోని కం చిలి, అనంతపురం జిల్లాలోని ధర్మవరం ప్రాంతాలలో కొందరు స్థిరపడ్డా రు. వీరు పట్టు దారాలతో వస్త్రాలు తయారుచేసేవారు. కనుకనే ఆ ప్రాం తాలు మినహా మరెక్కడా వీరు మగ్గం పట్టిన దాఖలాలులేవు.

ఇక ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం తదితర కొండ, అటవీప్రాం తాలలో దొరికే ఉత్పత్తులపెై వీరు ఆధారపడి జీవిస్తున్నారు. వేటగాళ్లుగా, రెైతు కూలీలుగా కూడా వీరు కనిపిస్తారు. కడప జిల్లాలోని పులివెందులలో స్వ ర్ణకారులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు ప్రాంతంలో కాపు సారా కాస్తుం టారు. ప్రాంతానికి ఒక వృత్తి ఎంచుకోవటంతో వీరు ఏకం కాలేకపో యా రు. భిన్న వృత్తులు వీరిని మరింత దూరం చేశాయనే చెప్పొచ్చు. ఈ క్ర మంలో వీరు ఎన్ని వృత్తులను ఎంచుకున్నా అవన్నీ ఆర్థికంగా అభివృద్ది చెందడానికి దోహదపడలేదు. దీంతో నేటికీ దయనీయ స్థితిలోనే రోజులు గడుపుతున్నారు. పట్ర సామాజికవర్గంలో సొంత భూమి ఉన్నవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. నాటి బిసి కమిషన్‌ చెైర్మన్‌ డి సుబ్రమణ్యం వీరి దుస్థితిని స్వయంగా చూశారు. కనుకనే వీరి కులానికి న్యా యం జరగా లంటే ఎస్టీ జాబితాలో చేర్చాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రిజర్వేషన్‌ జాబితాలో పట్ర కులాన్ని చేర్పించేందుకు వీరు పడిన శ్రమ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1968 వరకు బిసి రిజర్వేషన్‌ జాబితాలో ఉన్న వీరి కులాన్ని అనంతరామన్‌ కమిషన్‌ తొలగిస్తే 40 ఏళ్ల పాటు సుదీ ర్ఘపోరాటం చేసి సాధించుకున్న ఘనత వీరికే చెందుతుంది. అనం తరామన్‌ కమిషన్‌ విచారణ ఫలితంగా పట్ర కులం బిసి జాబితా నుండి 1968లో తొలగించబడింది. కాగా అనంతరామన్‌ కమిషన్‌ అసమగ్ర విచారణ చేసిందంటూ పట్ర కులస్తులు 1974లో మురళీధరరావు కమి షన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఫలితంగా 1986లో ఎన్‌టి ఆర్‌ ప్రభుత్వం వీరిని బిసీ-డిలో చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు. ప్రభుత్వం చేసిన పొరపాటు కారణంగా జీఓ చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. అయినా వీరు పట్టువీడలేదు. పరిచయం ఉన్న ప్రతినాయకుడినీ పట్టుకున్నారు.

ఫలితంగా కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1994లో బిసీ జాబితాలో వీరిని చేర్చారు. కాగా ఒక బీసీ నాయకుడు కోర్టుకు వెళ్లటంతో కథ మళ్లీ మొదటికి వచ్చిం ది. అయినా పట్ర నాయకులు నీరుత్సాహపడలేదు, ప్రయత్నాలూ ఆప ేదు. 1998 వరకు జస్టిస్‌ పుట్టుస్వామిని కలిసి అనేకసార్లు వివరించారు. 1999లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ బిసీ కమిషన్‌ బెంచ్‌ జస్టిస్‌ బిఎల్‌ యాదవ్‌ను సైతం కలిశారు. ఎటువంటి ఫలితం లేకపో యినా జాతీయ కమిషన్‌తో ఉత్తరప్రత్యుత్తరాలు మాత్రం ఆపలేదు. 2002లో కమిషన్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో వీరు కలిసి వివరిం చిన ఫలితంగా 2004లో ఆంధ్రప్రదేశ్‌ ఓబిసీ జాబితాలో సీరియల్‌ నంబ ర్‌ 105లో పట్ర కులాన్ని చేరుస్తూ గెజిట్‌ విడుదలెైంది. వీరు చేస్తున్న ప్రయత్నాలకు ఇది మరింత ప్రోత్సాహం ఇచ్చింది. దీంతో వీరి ప్రయత్నా లు ముమ్మరం చేయడంతో... ఆ కృషి ఫలించి నాటి రాష్ర్ట బిసీ కమిషన్‌ చెైర్మన్‌ జస్టిస్‌ డి సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం కడప, అనంతపు రం జిల్లాలలోని పట్ర కులస్తుల జీవనశెైలిని పరిశీలించింది.

ఈ నేపథ్యం లో బిసి-ఏ గ్రూప్‌లో వీరిని చేర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎట్టకేలకు పట్ర కులాన్ని బిసి- ఏ గ్రూప్‌లో చేరుస్తూ జీఓ విడుదల అయ్యింది. అయితే వీరిలో ఎక్కుక మంది కొండకోనలను నమ్ముకుని జీవించడంతో ఈ రిజర్వేషన్ల ఫలాలను అక్కడివారు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. దీనికితోడు అక్షరా స్యుల సంఖ్య కూడా తక్కువ కావడం మరో కారణం. దీంతో నేటికీ దయనీయ స్థితిలోనే రోజులు గడుపుతున్నారు.

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి;
sri-ramluఇప్పటికీ నాగరిక ప్రపంచానికి దూరంగానే జీవి స్తున్న తమ సామాజికవర్గాన్ని ఆదుకోవడానికి ప్రభు త్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ పట్ర సం క్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఏ శ్రీరాము లు కోరుతు న్నారు. మైదాన ప్రాంతం చేరుకున్న వారిలో కొందరు విద్యావంతు లెైనప్పటికీ పట్ర కులస్తుల జీవనశెైలి అనాగరికం గా ఉందంటున్నారు. ఈ క్రమంలో పట్ర కులస్తులను త్వరలో ప్రకటించనున్న ఎంబిసి జాబితాలో చేర్చితే కొంతవరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు.

అనేక కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విధంగా తమ కులానికీ ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వివిధ వృత్తులలో ఉన్న పట్ర కులం వారికి చేయూత ఇవ్వాలని కోరారు.అణగారినవర్గంగాను, కొండకో నల్లో ఉంటున్నవారిగా జీవిస్తున్న తమ కు ప్రభుత్వ పథకాలు కూడా దరిచేర ట్లేదని విచారం వ్యక్తం. తమ సామాజిక వర్గం విద్యాపరంగా వెనుకపడింది కనుకనే స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు దాటుతున్నా ప్రభుత్వపరంగా అందుతున్న ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నోట్: బీసీ కులాల వారు తమ తమ కులాల వివరాలను షషష.రతీవ.శీఎకు మెరుుల్‌ చేయవచ్చు లేదా వేణుగోపాల్‌ (ఫోన్‌: 9603462269) ను సంప్రదించవచ్చు

hjg

No comments:

Post a Comment